S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/30/2016 - 23:44

నల్లధనం బయటపెడతానంటే అందరూ స్వాగతించాం. కాని నల్లకుబేరుల జాబితా బహిర్గతం చేయలేదు. అంతకంటే మించి నల్లమార్కెట్ పుంజుకుంది. మార్కెట్లో గందరగోళం, అయోమయం. ఏ క్షణాన ఏ రూల్స్ ప్రకటిస్తారో తెలియదు. మన ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న ఆకస్మాత్తుగా పెద్దనోట్లను రద్దుచేయడంవల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోంది.

11/30/2016 - 23:42

నోట్లను రద్దుచేయడం వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, అమలు చేసేందుకు చేపట్టిన విధానం మాత్రం సరైంది కాదు. భారతదేశంలో కొంతమంది బడాబాబుల వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీయాలని ప్రభుత్వం భావించడంలో తప్పులేదు. దేశంలో ప్రతి పౌరుడి ఆదాయం చట్టానికి లోబడి ఉండాలన్నది కేంద్రం ఉద్దేశంగా స్పష్టమవుతోంది. నీతివంతమైన పాలనను ప్రజలకు అందించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచించి ఉండవచ్చు.

11/30/2016 - 23:41

పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నెలకు రెండు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌కు ఫిర్యాదు చేశారన్న విషయం అవాస్తవం.

11/30/2016 - 23:40

నల్లధనాన్ని నిర్మూలించేందుకు 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బాగానే ఉంది కానీ రెండు వేల రూపాయల నోటును ఎందుకు తెచ్చినట్లు? ఇది నల్లధనాన్ని ప్రోత్సహించడం కాదా? స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకుని రావడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం దానిని కప్పిపుచ్చుకోవడానికి పెద్దనోట్లను రద్దు చేసింది.

11/30/2016 - 23:39

నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల నల్లధనానికి అడ్డుకట్ట పడుతుంది. రియల్ ఎస్టేట్ ప్రక్షాళనకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో యోగ్యత లేని డెవలపర్లకు అడ్డుకట్ట పడుతుంది. హైదరాబాద్ మార్కెట్‌లో 95శాతం మధ్య తరగతి గృహ విభాగమే ఉంటుంది. సేవింగ్స్, బ్యాంకు రుణాల నుంచే వీరు గృహ రుణాలు చెల్లిస్తారు. నోట్ల చలామణి లేకపోవడం అనేది ఈ రంగంపై ప్రభావం చూపదు.

11/30/2016 - 23:38

పెద్దనోట్లను రద్దు చేసినంత మాత్రాన అవినీతి అగదు.. నకిలీ కరెన్సీ బెడద తప్పదు.. భారత్‌ను అవినీతిరహిత దేశంగా చూడాలనే కరెన్సీ మార్పు జరిగిందని భావిద్దాం. అయతే నల్లధనాన్ని వెలికి తీసినంత మాత్రాన దేశంలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అనుకోవడానికి లేదు. రూ. వెయ్యి, ఐదువందల కరెన్సీ రద్దయి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కశ్మీర్, గుజరాత్‌లోనూ రెండువేల రూపాయల నకిలీ నోట్లు బయటపడ్డాయి.

11/23/2016 - 22:23

నవంబర్ 8వ తేదీ రాత్రి భారత ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనల ఉప్పెన సునామిగా మారింది. నగదు మార్పిడి ఒక పెద్ద సమస్యగా , బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలతో అంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్న నగదు మార్చుకోవాలన్నా, బ్యాంకుల్లో ఉన్న నగదు ఉపసంహరించుకోవాలన్నా చాంతాడంత క్యూలలో జనం నిల్చుని సిగపట్లు పడుతున్నారు.

11/23/2016 - 22:09

నోట్ల రద్దుతో ఏ రంగంపై ఎలాంటి ప్రభావం పడబోతుందో, ఏ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పటికి ఇప్పుడే చెప్పలేం. ఏ ఆర్థిక వేత్త కూడా వంద శాతం ఇలానే జరుగుతుంది అని చెప్పలేరు. ఏ మంచి పని చేయాలన్నా వంద శాతం మంచే జరుగుతుంది అని చెప్పలేం. ప్రభావం ఏ విధంగానైనా ఉండవచ్చు. దొంగ సొమ్ము, నల్ల ధనం దేశానికి, సమాజానికి మంచిది కాదు.

11/23/2016 - 22:06

వెయ్య, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికార పార్టీకి చెందినవారు ఈ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కేంద్ర నిర్ణయంపై పూర్తి అవగాహన కల్పించాలి.

11/23/2016 - 22:05

పెద్ద నోట్ల రద్దు పేరిట పేద, మధ్య తరగతి ప్రజలను మానసికంగా, శారీరకంగా హింసించారు. దీని పర్యావసానం వచ్చే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అనుభవించక తప్పదు. అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేద ప్రజల అకౌంట్లలో లక్షల రూపాయలు వేస్తామని ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ గొప్పగా ప్రకటించారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు.

Pages