S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

05/11/2016 - 21:18

దేశ భవిష్యత్, జాతి భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికా జనాభాకు సరిసమానంగా మన దేశంలో యువత ఉంది. దేశ జనాభాలో యువత అరవై శాతం పైగా ఉన్నారు. అంటే అద్భుతమైన మానవ వనరుల దేశం మనది. వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ, దేశ ప్రగతిలో భాగస్వామ్యులుగా చేస్తే ప్రపంచ దేశాలకు దీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయవచ్చు. అయితే నేటి యువత తీరుపై అనేక విమర్శలూ, ఫిర్యాదులూ ఉన్నాయి.

05/11/2016 - 21:17

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో యువతలో మానవతా విలువలు దిగజారిపోతున్నాయి. రోజురోజుకూ ప్రసార మాధ్యమాలు, ఐటి టెక్నాలజీ యువతీ, యువకులకు యమస్పీడ్‌గా అందుబాటులోకి వస్తోంది. పాశ్చాత్య సంస్కృతిని పెంపొందిస్తోంది. దీంతో దేశ సంస్కృతితోపాటు మానవతా విలువలు పడిపోతున్నాయి.

05/11/2016 - 21:15

యువత గాడి తప్పుతోంది అనేది అందరి విమర్శ. విమర్శ చేసేవారు యువతను సన్మార్గంలో ఉంచేందుకు ప్రయత్నించాలి. యువత గాడితప్పితే ఆ తప్పు వారిదికాదు... సమాజానిదే. ఎందుకంటే ఏ ఒక్కరూ కావాలని తప్పుదారి పట్టరు. పరిసరాలు, పరిస్థితుల ప్రభావం వారిని తప్పుదారి పట్టిస్తాయి. వాటిని అర్థం చేసుకుని లోతైన ఆలోచన చేసిననాడు, ఆ లోపాలకుపరిష్కారం సూచించిననాడు యువత శక్తివంతంగా తయారవుతుంది.

05/11/2016 - 21:14

కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, సామాజిక వ్యవస్థ సాఫీగా సాగాలన్నా, దేశం అన్ని రంగాల్లో పురోగమించాలన్నా యువత ప్రధానమైన చోదకశక్తిగా నిలుస్తుంది. మన దేశంలో అపారమైన యువశక్తి ఉంది. అది సురక్షితమైన భావి భారతానికి భరోసా. చేతికందివచ్చిన పిలల్లను చూసి తల్లిదండ్రులు ఏ విధంగా నిశ్చితంగా ఉంటారో, దేశం కూడా యువశక్తిని చూసి నిశ్చితంగా ఉండవచ్చు. యువశక్తి ఈ దేశ భవిష్యత్తుకు ఇన్సూరెన్స్ లాంటిది.

05/11/2016 - 21:13

భారతీయ జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాగరిక సమాజంలో కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది. సమిష్టి కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ఇవి ప్రతి ఒక్కరినీ ఆందోళన కలిగించే అంశాలు. ఏ పని చేసినా కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం లేదు. పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. వృద్ధులైన తల్లిదండ్రులను అనాథ శరణాలయంలో, వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. కొన్ని కుటుంబాలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది.

05/11/2016 - 21:12

సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్న మాట వాస్తవమే. దీనికి అనేక రకాల కారణాలున్నాయి. పాశ్చాత్య పోకడలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల స్వేచ్ఛ స్వాతంత్య్రాల ముసుగులో యువత పెడదారి పడుతున్నారు. కాలం మారుతోంది. దానికి అనుగుణంగానే సమాజంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులతో జీవనశైలిలో పెనుమార్పులు సంభవించాయి. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడం వల్ల ఇబ్బందులు పెరుగుతూ వస్తున్నాయి.

05/05/2016 - 07:54

కొద్ది రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్లకు అఖిల భారత ప్రీ మెడికల్, ప్రీ డెంటల్ పరీక్ష నిర్వహిస్తున్న తరుణంలో జాతీయస్థాయిలో 15 శాతం ఓపెన్ కోటాకోసం ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలనే ఆలోచనలోంచి పుట్టిందే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్). యుజి కోర్సులకు ఒక నీట్, పిజి కోర్సులకు మరో నీట్ నిర్వహించాలని 2011లో నిర్ణయించారు. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు.

05/05/2016 - 07:54

వైద్య విద్య చాలా సంక్లిష్టమైంది. ఎంతో నైపుణ్యం, సామర్థ్యం, కౌశలం ఉన్న వైద్యుల అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైద్య విద్యను అభ్యసించేవారు శక్తి సామర్థ్యాలతోపాటు జ్ఞాన సంపన్నులై ఉండాలి. మన దేశంలో పదేళ్లు సెకండరీ విద్య, రెండేళ్లు ఇంటర్మీడియట్ ముగిస్తే వెంటనే వైద్య విద్యను అభ్యసించేవీలుంది. ఇతర దేశాల్లో వైద్య విద్యకు 20 ఏళ్లు పడుతుంది.

05/05/2016 - 07:53

మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహిస్తున్న నీట్ వల్ల రాష్ట్ర విద్యార్థులకు మేలు జరుగుతుంది. దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ప్రవేశం పొందే వీలుంటుంది. సిబిఎస్‌ఇ విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష అనుకూలం అన్న విమర్శలు సరికాదు. గత ఏడాది ఈ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించగా, సిలబస్ మార్చాల్సి ఉందని చెప్పడంతో కొంత గడువు ఇచ్చారు. ఆ తరువాత ఇంటర్మీడియట్‌లో సిలబస్ మార్చారు.

05/05/2016 - 07:52

వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి కేంద్రం జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహంచే కన్నా ఏ రాష్ట్రానికి ఆ రాష్టమ్రే నిర్వహించుకుంటే మంచిది. ఈ విషయంలో కేంద్రీకరణ అంటే కష్టం. కేంద్రప్రభుత్వం తన ఆధీనంలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలనుకోవడం మంచిది కాదు. ఇప్పుడు నీట్‌పై ఇంత రాద్ధాంతం జరుగుతుందంటే కేంద్రం దేశం మొత్తం మీద వైద్య విద్యను తన ఆధీనంలోకి తీసుకోవాలని చూడ్డమే అవుతుంది.

Pages