S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

05/05/2016 - 07:52

నీట్ పరీక్షతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఉన్నఫళంగా ‘నీట్’కు హాజరుకావాలంటే, అది విద్యార్థులకు సాధ్యమయ్యే పనేనా? ఒక్కో రాష్ట్రంలో ఒక రకంగా సిలబస్ ఉంటుంది. అటువంటప్పుడు జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ను విద్యార్థులు ఎలా తట్టుకోగలుగుతారు? కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా అన్ని రాష్ట్రాల సిలబస్‌ను అధ్యయనం చేసుంటే బాగుండేది.

05/05/2016 - 07:51

దేశ వ్యాప్తంగా ఒకే రకమైన ప్రవేశ పరీక్ష ద్వారా వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ చేయాలనుకుకోవడం మంచి ఆలోచనే. కానీ ఆ రకంగా చేసే ముందు మన దేశంలో విద్యావ్యవస్థ ఎలా ఉందనే కోణంలో సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంది. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ సమానంగా అభివృద్ధి చెందాలి. అప్పుడే జాతీయ స్థాయిలో ఏదైనా ఒకే ప్రవేశ పరీక్ష ఉంటే అందరూ హర్షిస్తారు.

05/05/2016 - 07:50

అఖిల భారత మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. చాలాఏళ్లుగా విద్యార్థులు ఎమ్సెట్‌కు సన్నద్ధం అవుతున్న ఈ తరుణంలో అకస్మాత్తుగా ‘నీట్’కు విద్యార్థులు మానసికంగా సన్నద్ధం కాలేరు. ఎమ్సెట్ మూడ్‌లోనే విద్యార్థులున్నారు. జాతీయ ప్రవేశపరీక్ష ప్యాటర్న్‌కు సిద్ధం అయ్యే సమయం కూడా విద్యార్థులకు లేనందున వారంతా మనోవేదనకు గురవుతున్నారు.

05/05/2016 - 07:49

నీట్ విషయంలో ఇంత గందరగోళం నెలకొనడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. లోగడ ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఆదివారం ‘నీట్’ జరిగినా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్‌లో పరీక్ష జరగలేదు. ‘నీట్’కు హాజరుకావాలా? లేదా? అసలు నిర్వహిస్తారా? లేదా?

05/05/2016 - 07:49

దేశంలోని అన్ని వైద్య కళాశాల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఒకే ఉమ్మడి పరీక్ష నీట్‌ను నిర్వహించాలనుకునే ఆలోచన మంచిదే కాని, రాష్ట్రాలకు గడువు ఇవ్వాలి. లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు దెబ్బతింటారు. నీట్‌కు కామన్‌గా సిలబస్‌ను ప్రకటించాలి. దానికి అనుగుణంగా పరీక్షను నిర్వహించాలి. ప్రస్తుతం సిబిఎస్‌ఇ, స్టేట్ సిలబస్ ఇలా వేర్వేరు సిలబస్‌లు ఉన్నాయి.

05/05/2016 - 07:48

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నీట్’తో నా రాష్ట్రం, మా రాష్ట్రం అనే ప్రాంతీయ భావన తొలగిపోతుంది. దేశంలో అందరిదీ ఒకే భావన కలుగుతుంది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ అనేది మంచిదే.. కానీ కొంత గడువు ఇస్తే బాగుండేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికులు తెలుగు భాషకే అలవాటుపడి ఉన్నారు. నీట్‌కు ఆంగ్లం, హిందీ భాషలు అవసరం. కాబట్టి కొంత గడువు ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు వెసలుబాటు ఉంటుంది.

05/05/2016 - 07:48

తెలంగాణ, ఆంధ్ర ఏ రాష్ట్రం అయినా నీట్ వల్ల గ్రామీణ విద్యార్థులకు నష్టం కలుగుతుంది. దేశ వ్యాప్తంగా మెడికల్ ఎంట్రెన్స్ ఒకటే నిర్వహించాలనే ఉద్దేశం మంచిదే కావచ్చు. ఇది అర్బన్ ప్రాంతాల్లోని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు నష్టం కలిగిస్తుంది. అర్బన్ ప్రాంతాల్లో, కాస్త సంపన్న కుటుంబాల పిల్లలు సెంట్రల్ సిలబస్‌లో చదువుతున్నారు.

04/27/2016 - 23:04

గడచిన 60 ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ కరవు ఏర్పడింది. రెండు రాష్ట్రాలూ కరవు ప్రాంతాలను గుర్తించి ప్రకటించడమేగాక, అనేక కరవు నివారణ చర్యలను చేపట్టాయి. ప్రభుత్వపరంగా జరుగుతున్న కార్యక్రమాలు సరిపోవడం లేదు, ఎంత పెద్దఎత్తున నిధులు కేటాయించినా సరిపోని రీతిలో కరవు విశ్వరూపాన్ని దాల్చింది. కేంద్రం ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు.

04/27/2016 - 22:59

ప్రతి మూడేళ్లకోసారి తెలంగాణను కరువు దెబ్బతీస్తోంది. తాత్కాలిక ఉపశమన చర్యలు తాత్కాలికంగానే ఉపయోగపడతాయి. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో కరవు సహాయం అందకపోయినా ప్రభుత్వం మాత్రం కరవు నివారణ చర్యలు చేపట్టింది. మంచినీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

04/27/2016 - 22:58

రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఖమ్మంలో ప్లీనరీ జరుపుకోవడం సిగ్గుచేటు. కరవు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదు. గ్రామాల్లో మంచి నీరు, సాగు నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు పంటలు ఎండిపోయి రైతులు దిక్కులేని వారయ్యారు. రైతులు కూలీలుగా మారుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ప్లీనరీ జరుపుకున్నది. ఇది ఆందోళన కలిగించే అంశం.

Pages