S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

04/20/2016 - 21:25

విద్య ప్రాథమిక హక్కు అన్న సంగతి ప్రభుత్వాలు మర్చిపోయాయి. కాబట్టే ఈ రోజు విద్యా రంగం భ్రస్టుపట్టిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వాలే గుర్తించకపోతే ఇక ప్రైవేట్ వ్యవస్థలు ఏం గుర్తిస్తాయి. విద్యార్థుల సంఖ్య లేదని పాఠశాలలను మూసివేయడం ఎంతవరకు కరెక్ట్? ఏవో కుంటిసాకులు చెప్పి పాఠశాలలను మూసివేయడం ద్వారా ప్రభుత్వం విద్యావ్యవస్థను తమ చేతులతోనే భ్రస్టుపట్టించి వేస్తున్నట్లు ఉంది.

04/20/2016 - 21:33

తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం క్రాస్‌రోడ్స్‌లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్యను అందించే ప్రయత్నం జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో సైతం దాదాపు అదేలైన్‌లో మోడల్‌స్కూళ్లను పెద్దఎత్తున ప్రారంభించి ఉచిత విద్యను అందించే కృషి మొదలైంది. ప్రస్తుతం పాఠశాల విద్యలో 80 శాతం మందికి ఉచితంగానే విద్య అందుతోంది, పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఉచితంగానే ఇస్తున్నారు.

04/14/2016 - 01:17

‘దేవానం దేవస్య వా ఆలయా’ అన్నారు రుషి పుంగవులు. సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం, పురాణం అన్నింటి సంగమ స్థానం హిందూ దేవాలయాలు. దేవాలయం అంటే మత సంబంధమైన ప్రార్థనలకు వినియోగించే పవిత్రమైన కార్యస్థానం. హిందూ సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణ పద్ధతులు విధానాలు ఇందులో కనిపిస్తుంటాయి. దేవాలయాలు ప్రార్ధనకోసం, పూజకోసం, దేవతా విగ్రహాలను ఇతర ఆరాధ్య వస్తువులను సందర్శించేందుకు ఏర్పాటు చేసినవే.

04/14/2016 - 01:17

ప్రస్తుతం మన దేశంలో న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూమతానికి సంబంధించిన అంశాలపై కోర్టులు ఇస్తున్న తీర్పులు పరిశీలిస్తే, భారతీయ ఆచార, వ్యవహారాలకు కోర్టులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. మహిళలకు హిందూమతం, భారతీయ సంస్కృతి మహోన్నతమైన స్థానం కల్పించాయి. శివుడి ఆలయాల్లో తొలుత అమ్మవారికి పూజలు చేసిన తర్వాత శివుడికి పూజలు చేస్తారు.

04/14/2016 - 00:50

భారతదేశం లౌకిక రాజ్యం. అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంది. మతాలపై పెత్తనం వహించేందుకు రాజ్యాంగంలోని మూడు స్తంభాలకు (లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ) కూడా అధికారం లేదు. మత సంస్థల పరిపాలనాపరమైన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. ఎక్కడైనా చట్టానికి విరుద్ధంగా పరిపాలనాపరమైన కార్యక్రమాలు జరిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

04/14/2016 - 00:49

దేవాలయాలు ఆగమశాస్త్రాల ప్రకారం, అనూచాన సాంప్రదాయం ఆచారాల ప్రచారం నడుస్తాయి. ఆలయ సాంప్రదాయాలలో ఆచారాల్లో ప్రభుత్వానికి నామమాత్ర ప్రమేయం ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛకు ప్రాథమిక హక్కులలో స్థానం కల్పించారు. భారత రాజ్యాంగ చట్టంలోని 26, 27, 28 అధికరణలు మతస్వేచ్చకు హక్కును కల్పిస్తున్నాయి.

04/14/2016 - 00:48

దేవాలయాల్లోకి మహిళలకు ప్రవేశం ఉండాల్సిందే. సనాతన ధర్మం మహిళలకు చాలా గౌరవం ఇచ్చింది. వారిని దేవతలుగా పూజించింది. దేవతలను ఆడవారు మగవారు అనే తేడా లేకుండా అందరూ మొక్కుతారు. ఏ కాలంలో ఇలాంటి నిబంధనలు విధించారో? ఎందుకు విధించారో తెలియదు కానీ కొన్ని ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించకపోవడం మంచిది కాదు. ఆలయాల ప్రవేశం అందరికీ ఉండాలి. ఒకప్పుడు పాటించిన ఆచారాలను మార్చుకున్నాం.

04/14/2016 - 00:47

విలక్షణ సంప్రదాయం హిందూ మతానికి ఉంది. ఆగమాలలో హిందూత్వానిదే ప్రథమ ప్రాధాన్యం. హిందూ దేవాలయాల్లో నిత్య ధూప, దీప, నైవేధ్యాల సమర్పణ, ఉత్సవాల నిర్వహణ ఒక విశేషాంశం. ప్రత్యేకించి కొన్ని దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. హిందూ సమాజంలో మహిళకు ఎప్పుడూ అగ్రస్థానమే ఉంది. దేవాలయాల్లో మహిళల ప్రవేశం అన్న అంశం పూర్తిగా సంప్రదాయం, ఆచారం, కట్టుబాట్లకు సంబంధించినదే.

04/14/2016 - 00:45

మహిళలు వివక్షకు గురవుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మహిళను గృహలక్ష్మిగా, దేవతగా, కనకదుర్గమ్మగా ఇలా రకరకాలుగా పోల్చి చెబుతుంటారు. మరి అలాంటి ఆడవాళ్లను శనిదేవుని ఆలయంలోకి అనుమతించకపోవడానికి కారణం ఏమిటో తెలీదు. నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఒకప్పుడు దళితులకు ఆలయ ప్రవేశం లేదన్నారు. వెలివేసినట్లు చూశారు. ఇప్పుడు మహిళలకు ఆలయ ప్రవేశం లేదంటున్నారు.

04/14/2016 - 00:44

ఏ సంప్రదాయానికి సంబంధించిన దేవాలయంలోనైనా విగ్రహాన్ని ప్రతిష్టించేప్పుడు తప్పనిసరిగా ఆగమ శాస్త్రాలను పాటిస్తారు. ఆ తర్వాత గర్బగుడిలోకి ఎవరినీ అనుమతించరు. ప్రత్యేకించి మూల విరాట్టును ముట్టుకోవడానికి అనుమతించరు. ఆ దేవాలయాలకు చెందిన ప్రధాన అర్చకునికి తప్ప ఇతరులెవ్వరూ మూల విరాట్టును ముట్టుకునేందుకు అర్హులుకారు.

Pages