S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

04/14/2016 - 00:43

సనాతన హిందూ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. భారతదేశం ఎన్నో ఏళ్ళుగా సంస్కృతి, సంప్రదాయాలతో విరాజిల్లుతున్నది. తాజాగా మహారాష్టల్రోని శని దేవాలయంలో శని విగ్రహాన్ని ముట్టుకుంటామని, పూజిస్తామని తృప్తి దేశాయ్ నేతృత్వంలో ఆందోళన చేయడం జరిగింది. శని దేవుణ్ణి పూజించరాదని ఎవరూ చెప్పలేదు. అది వివాద అంశమే కాదు. శని దేవున్ని ముట్టుకుంటామన్నదే వివాద అంశం.

04/14/2016 - 00:41

శని సింగ్నాపూర్ దేవాలయంలో మహిళలకు ప్రవేశంపైనే దేశంలో చర్చను లేవగొట్టారు. భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ దేవాలయాల ప్రవేశానికి లింగవివక్ష లేనేలేదు. ఎక్కడో ఏదో దేవాలయంలో స్థానికంగా ఏదోకాలంలో ఏర్పాటు చేసి ఉంటే ఆ విషయాలపై హిందూ సమాజంలోని ఆధ్యాత్మికవేత్తలు, స్థానికులతో చర్చించి, కాలానుగుణంగా మార్పులు తీసుకురావచ్చు. దానిని వివాదాస్పదం చేస్తే మార్పు వస్తుందని కొందరు భావిస్తూ ఉంటారు.

04/06/2016 - 21:34

చదువు ఎందుకోసం... చదువు కేవలం గొప్ప లక్షణాలను అలవరచుకునేందుకేనా? ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకునేందుకా? ఉన్నత ఉద్యోగాలు సంపాదించేందుకా? సమాజంలో సమర్థులైన నీతివంతులను తయారుచేసేందుకా? నైతిక విలువలతో కూడిన పౌరులను అందించేందుకా?

04/06/2016 - 21:33

యూనివర్శిటీల పరువు ఎలా పోతోందో... వైస్ చాన్సలర్లు చేస్తున్న అక్రమాలు, అవినీతి కార్యక్రమాల గురించి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుగారు శాసనసభలో చెప్పారు. వారు చెప్పింది అక్షరాల నిజం...ఇపుడు సిఎం గారు చెబుతున్న విసిలను ఈయన నియమించలేదు, గత ప్రభుత్వాలు నియమించిన వారు. మనకు కావల్సింది ఇదే...తప్పు ఎక్కడ జరిగిందో సిఎం గారు గుర్తించారు, ఇక మనకు మంచి విసిలు వస్తారనే నమ్మకం కలుగుతోంది.

04/06/2016 - 21:31

విశ్వవిద్యాలయాలు అనేవి ప్రస్తుతం పరీక్షా నిర్వహణ కేంద్రాలుగా మారిపోయాయి. అసలు వీటి స్థాపన వెనుక ఉన్న ఉద్దేశమే గాడితప్పింది. కేవలం పరీక్షల నిర్వహణను సులభతరం చేసేందుకు చాలా ఎక్కువ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు ఉంది.

04/06/2016 - 21:30

ఉన్నత విద్యపట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సమాజాభివృద్ధిలో కీలకభూమిక పోషించాల్సిన విద్యారంగాన్ని అభివృద్ధి పథంవైపు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలోని విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్-్ఛన్సలర్లు లేరు. పాలక మండళ్లను ఏర్పాటు చేయలేదు. బోధనా సిబ్బంది అవసరమైన సంఖ్యలో లేరు. అవసరమైన మేరకు భవన సౌకర్యాలు, వౌలిక సదుపాయాలు లేవు.

04/06/2016 - 21:27

విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యక్షులు, అధ్యాపకుల పోస్టులు అమ్ముడుపోతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విద్యార్థులు, అధ్యాపకులు చీలిపోతున్నారు. చాలాచోట్ల వైస్‌చాన్సలర్ల పోస్టులను కొంతమంది అనర్హులైన అధ్యాపకులు లక్షలాది రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. విసి పదవి వచ్చిన తర్వాత అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా చేస్తే యూనివర్శిటీల్లో అశాంతి ఉండదా?

04/06/2016 - 21:26

యూనివర్శిటీల ఛాన్సలర్లను, వైస్-్ఛన్సలర్లను ప్రభుత్వమే నియమించాలని భావించడం సరైంది కాదు. కొత్త ప్రయోగాలు వద్దు. మానవ వనరుల అభివృద్ధి వర్సిటీల్లో జరుగుతుంది. రిటైర్డ్ జడ్జిలనో, రిటైర్డ్ ఐఏఎస్, ఐపిఎస్‌లనో నియమించడం ద్వారా పెద్దగా ఫలితాలు ఉండవు. రిటైర్డ్ జడ్జిలను, రిటైర్డ్ ఐఏఎస్‌లను ఇక్కడ చిన్నబుచ్చడం లేదు. వారి రంగాల్లో అపూర్వమైన ఫలితాలు సాధించి ఉంటారు.

04/06/2016 - 21:21

దేశంలో మేధావుల మధ్య, వారు నమ్ముతున్న సిద్ధాంతాలతో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇస్లామిస్టులు, మతం మార్చుకున్నవారు, కమ్యూనిస్టులు, సెక్యూలరిస్టులు వీరంతా ఒక వర్గంగా, భారతీయ తత్వం అచరించే దేశీయులు ఒక వర్గంగా ఉన్నారు. మేధావులు అంతర్యుద్ధానికి విశ్వవిద్యాలయాలను కేంద్రంగా చేసుకున్నారు. ఈ అంతర్యుద్ధానికి కమ్యూనిస్టులు మద్దతుగా నిలిచారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఆవిర్భవించి 90 ఏళ్లవుతుంది.

04/06/2016 - 21:20

విద్యావేత్తలు, మేధావులు, నిష్ణాతులుగా ఉన్నవారే వైస్ ఛాన్సలర్లుగా నియమించబడాలి. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులను ఉత్తములుగా తీర్చి దిద్దాలంటే అన్ని రంగాల్లో ప్రావీణ్యం కలిగిన మేధావులు విసిలుగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా వైస్ ఛాన్సలర్ల నియామకం, విశ్వవిద్యాలయాల్లో వారి పాత్ర ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత విసిల నియామకంలోనే అంతులేని పక్షపాత వైఖరి కనిపిస్తోంది.

Pages