S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

03/27/2016 - 22:13

వర్తమాన ఆధునికత స్థితిగతుల్లో వడి పెరిగింది. ఆలోచనా వాడి పెరిగింది. బతుకుతెరువు బహుముఖీనమైన అనే్వషణా వ్యాప్తమైంది. వర్తమాన ఆధునికత స్థితికి నిర్దిష్ట లక్ష్యం, లక్షణం లేదు కనుకనే దీన్ని ద్రవాధునికత అన్నాడు జిగ్మంట్ భౌమన్. ఒక స్థిరమైన ప్రశాంత వాతావరణంతో కూడిన, ఏ మార్పులు లేని విధంగా జీవించడం నేడు అసాధ్యమై కూర్చుంది.

03/21/2016 - 00:15

ఎడారి ఆకాశానికి ఎండమావుల్ని అప్పజెప్పి
నెర్రల నేలకు అమృతస్తన్యమివ్వని
వట్టిపోయిన కార్తెల్ని కాడెద్దులకు బిగించి
నాగలి గొర్రుకు వేలాడుతున్న శవాలు!
వడిసెల దెబ్బకు రాలుతున్న పిట్టల్లా..
చెదలు పట్టిన అమృత హస్తాలకు అనంత దుఃఖం!
చేన్లు చెల్కలు వరి మొలకలు
కాటేసిన కాలంలో విముక్తి లేని శాపగ్రస్థలు!
మట్టి స్పర్శ మరణ మృదంగంలా..

03/21/2016 - 00:14

సంధ్యాకాశం ప్రతిరోజూ
ఎరుపెక్కే ఎర్ర చందనం
చంద్రుడు అదనుకోసం వేచి పైనబడి పారిపోయే చైన్‌స్నాచర్

అప్పు పత్రాలపై రాయబడ్డ అక్షరాలు మెరిసే నక్షత్రాలు
ఈ నల్లని మబ్బులు
తరతరాల సిరాతో వేసిన వేలిముద్రలు

అప్పు తీర్చడానికి
ఊరు విడిచి వెళ్ళిన మనిషి
అడ్రసు ఆచూకి ఎవరికి తెలియదాయె

03/21/2016 - 00:11

అస్సలు తోచనీయని సమయాలు
కొన్ని ఉంటాయి.
మాటే వినని మనసులుంటాయి

ఎక్కడో ఉన్న అమ్మని తలచే తలపులుంటాయి
కంటి కొలుకుల్లోంచి జారి పడని నీళ్ళుంటాయి
విలవిలలాడే ఆక్రోశాలుంటాయి

03/21/2016 - 00:09

రతీయ సమాజంలో ఆధునిక యుగం - 1850 ప్రాంతాల్లో ప్రారంభమయింది. 1857లో తొలి స్వాతంత్య్ర సమరం జరిగింది. అందువల్ల, ఆధునికతకు 1857ని చారిత్రక చిహ్నంగా గుర్తుపెట్టుకోవచ్చు. గతంలో తుప్పు పట్టిన ఇనుప ముక్కలేకాదు, వెదికిపట్టుకుని పరిరక్షించుకోవాల్సిన వజ్రాలూ, రత్నాలూ కూడా ఉంటాయి- అన్న చారిత్రక వాస్తవాన్ని మన సమాజం స్వీకరించి, ఆచరిస్తుంది.

03/21/2016 - 00:07

కలం ఎప్పుడూ శోకించదు
కవి స్ఫూర్తి వేదన భరించనపుడు
విషాద మేఘచ్ఛాయాలు క్రమ్మి
పరావర్తనం చెందినపుడు
భావస్ఫోరకమై సంచలిస్తూ
విచలితం జ్వలనమై
అశృతప్త కాసారమవుతుంది.
విరి తోటను విస్మరించిన విరజాజి
పరిమళాన్ని విదిల్చి వెళ్ళిపోయింది
నిన్నటి సంధ్యాసమయంలా
నిరుడు కురిసిన శ్రావణమేఘంలా
స్వర్ణమరుూ... సుకుమారీ...

03/21/2016 - 00:05

రామా చంద్రవౌళి
‘ఒక ఏకాంత సమూహంలోకి...’ కవితా సంపుటి

03/21/2016 - 00:03

పూలపిట్ట: వెల:రు.100/-
పుటలు: 96, సోమిశెట్టి స్వర్ణలత
ప్రతులకు: సోమిశెట్టి నరసింహారావు,
ప్లాట్ నెం.1502, జి.బ్లాక్
సేథి మ్యాక్స్‌రాయల్, సెక్టార్- 76
నోయిడా- ఉత్తరప్రదేశ్
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

03/14/2016 - 05:03

== పుస్తకమ్ ==

ఒక మేఘం కథ
కథల సంపుటి
రచయిత: సుంకోజి దేవేంద్రాచారి
ధర: రూ.120/-; పేజీలు: 189
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక దుకాణాలు.

03/14/2016 - 05:02

చిలుకల గుంపుకు
జాంకాయ ముక్కలు వేసారు
దూరపు కొండలు మురిపిస్తున్నాయి
యజమాని బడిలో పెరిగాయిగా అవే కూతలు!

మనకు పక్కోడిని చూసే వ్యూహమే లేదు
పేదోడి బతుకు చట్రంలో వేరే లోకమే లేదు
చీకటి... వెలుతురు లోకమంతా
రెండు మెతుకులు పొట్టలోకి వెళ్ళేందుకే
వచ్చే ఆదాయంలో
ఎన్ని రంగుల్ని నింపుకుంటారో
ఎన్ని ఆశల్ని రగిల్చుకుంటామో కదా?!

Pages