S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యువ
మైక్రోమ్యాక్స్ సంస్థ భారతీయ మార్కెట్లోకి తొలిసారిగా ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) స్మార్ట్ఫోన్ను తీసుకురాబోతోంది. ఇండియాలో తొలి ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు తుది సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ ఏడాది విడుదల కాబోతున్న అత్యంత శక్తిమంతమైన స్మార్ట్ఫోన్లలో వన్ ప్లస్ 6 ఒకటి. జూన్లో విడుదల కావచ్చని అంచనా వేస్తున్న ఈ భిన్నమైన స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 సాక్పై రన్ అవుతుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా వన్ ప్లస్ సిఇఓ ఈ వివరాలను తెలియజేశారు. వన్ ప్లస్ 6 స్మార్ట్ఫోన్కు తరువాత వెర్షన్ వన్ ప్లస్ 6 టి.
ఎస్ఆర్టి ఫోన్ పేరిట గతంలో ఓ స్మార్ట్పోన్ను లాంఛ్ చేసి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన స్మార్ర్టాన్ కంపెనీ మరో సరికొత్త స్మార్ట్ఫోన్తో బడ్జెట ఫ్రెండ్లీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టబోతోంది. టి ఫోన్ పి పేరుతో ఈ బ్రాండ్ లాంఛ్ చేసిన నూతన స్మార్ట్ఫోన్ జనవరి 17 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,999.
ఎనె్నన్నో ఆకర్షణలు..
భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే సామర్థ్యం యువశక్తికే ఉందని, ఈ దేశాన్ని నిరంతరం అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపే బాధ్యత యువతదేనని ప్రగాఢంగా విశ్వసించిన వివేకానందుడు కేవలం ఉపదేశాలకే పరిమితం కాలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని అంకితం చేసి అందరికీ స్ఫూర్తిదాతగా నిలిచారు.
తదేకంగా కంప్యూటర్లు, వీడియో గేమ్లు, టీవీలతో కాలక్షేపం చేస్తే నేత్ర సంబంధ సమస్యలే కాదు.. మానసిక రుగ్మతలు సైతం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో ‘తెర’కు అతుక్కుపోవడం అనే అలవాటు అంచనాలకు మించి విస్తరిస్తోంది.
నేడు అన్నివర్గాల వారిలోనూ స్మార్ట్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. డిమాండ్కు తగ్గట్టు మార్కెట్లో రోజురోజుకూ కొత్తరకం స్మార్ట్ ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. వీటి ధరలకు సంబంధించి చూస్తే ఎన్నో వ్యత్యాసాలు కనబడుతుంటాయి. సంపన్నులు ఎంత ఖర్చుపెట్టి అయినా అత్యంత ఖరీదైన ఫోన్లు కొంటుంటారు. మధ్యతరగతి వారు మాత్రం స్మార్ట్ఫోన్మీద ఎక్కువగా ఖర్చు చేయలేరు.
చైనా మొబైల్ తయారీ కంపెనీ ఇవోమి సరికొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లను బడ్టెట్ ధరకే ఇండియాలో ప్రవేశపెట్టింది. ఐ1, ఐఎస్ పేరుతో వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టిందది. ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్లో ఈ రెండు ఫోన్లు అమ్మకానికి రానున్నాయి. కంపెనీ ఈ రెండు ఫోన్ల ధరలను రూ.5,999, రూ.6,999గా నిర్ణయించింది.
దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం సామ్సంగ్ మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయబోతోంది. గెలాక్సీ ఎ8 ప్లస్ (2018) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో వుంటుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ పేజీని అమెజాన్ ఇండియా ఇప్పటికే తన వెబ్సైట్లో లాంఛ్ చేసింది. ఈ పేజీలో పలు టీజర్ వీడియోలతోపాటు నోటిఫై మి ఆప్షన్ను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచింది.
టెక్నాలజీ దిగ్గజం ఏసెర్ ఇతర సంస్థలకు సవాల్ విసురుతూ సరికొత్త ల్యాపీని వినిగదారుల కోసం తీసుకువచ్చింది. ఈ ల్యాపీని ఈనెలలోనే అట్టహాసంగా విడుదల చేశారు. 9.98 మి.మి మందంతో దూసుకువచ్చిన ఈ ల్యాపీని ‘స్విఫ్ట్ 7’ పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్తో వచ్చిన ఈ ల్యాపీని వినియోగదారులు ఎక్కడకైనా సులువుగా తీసుకెళ్ళే అవకాశం వుంది.
ఇప్పటికే ‘బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్’గా పేరొందిన ఆనర్-7ఎక్స్ త్వరలో రెడ్ కలర్ వేరియంట్లో దర్శనమిస్తుంది. ఈ ఫోన్లు లిమిటెడ్ ఎడిషన్లో మాత్రమే అందుబాటులో వుంటాయి. వచ్చే నెలలో కోలాహలంగా జరుపుకునే ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక మోడల్ను విడుదల చేస్తున్నట్లు ఆనర్ సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 4 నుంచి వీటి విక్రయాలు మొదలవుతాయి.