S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యువ
చైనా మొబైల్ తయారీ దిగ్గజం మిజు తన సరికొత్త స్మార్ట్ఫోన్ ‘మిజు ఎస్6’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమైంది. ఈనెల 17న ఈ ఫోన్ను చైనాలో విడుదల చేస్తారు. 18.9 యాస్పెక్ట్ రేషియోతో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. ఇందులో శామ్సంగ్మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ ఎక్సిన్యోస్ 7872 వాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ 4 జిబి/32 జిబి ఇంటర్నల్, 4జిబి/64 ఇంటర్నల్ వేరియంట్లలో వచ్చే అవకాశం వుంది.
మార్కెట్లో బాగా పాపులర్ అయిన మైక్రోమాక్స్ భారత్ సిరీస్ నుంచి మరో సరికొత్త స్మార్ట్ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంఛ్ కాబోతోంది. భారంత్-5 ప్లస్ పేరుతో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ఫోన్ మైక్రోమాక్స్ అఫీషియల్ లిస్ట్ అయి ఉంది. ధర, విడుదల తేదీ వంటి వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. శక్తివంతమైన 5000 ఎంఎహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో ఇన్బిల్డ్ చేసినట్లు తెలుస్తోంది.
గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనాలే తప్ప నిరాశతో నీరసపడకూడదని ‘మహిళా స్టంట్ రైడర్’గా సత్తా చాటుకుంటున్న 22 ఏళ్ల అనమ్ హషీమ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. అమ్మాయిలకు ‘రోల్ మోడల్’గా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని, మగువలు సాహసం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని అంటోంది.
డబ్బులు ఊరికే రావు.. ఇప్పటి వరకూ ఇచ్చింది చాలు..’ అంటూ ఇటీవలి కాలంలో తెగ ప్యాపులర్ అయిన ఓ నగల దుకాణం ప్రకటనను నేటి యువత తమ కోసం కాస్త సవరించుకుని- ‘ఉద్యోగాలు ఊరికే రావు.. ఇప్పటివరకూ కాలక్షేపం చేసింది చాలు.. కాస్త నైపుణ్యం, వైవిధ్యం ఉండాలి..’ అని అనుకోక తప్పదు. ఎందుకంటే డిగ్రీ సర్ట్ఫికెట్లు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలిచ్చే రోజులు పోయాయి.
సంక్షేమ పథకాలకు, ఇతర సేవలకు అనుసంధానం చేసినట్లే ఇకపై ‘ఫేస్బుక్’ ఖాతాదారులు ‘ఆధార్’ను వినియోగించాల్సిందే. నకలీ ఖాతాలను అరికట్టేందుకు ‘ఆధార్’ను ప్రాతిపదికగా తీసుకోవాలని సామాజిక మీడియా దిగ్గజం అయిన ‘ఫేస్బుక్’ నిర్ణయించింది. సెల్ఫోన్ ద్వారా కొత్తగా ఫేస్బుక్లో ఖాతాలు తెరిచేవారు ఇక ‘ఆధార్’లోని తమ పేరును ఇవ్వాల్సి ఉంటుంది.
ల్యాపీ దిగ్గజం ఏసర్ ప్రీడేటర్ 21 ఎక్స్ పేరుతో అత్యంత ఖరీదైన ధరలో నూతన గేమింగ్ ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. బెర్లిన్లో 2016లో ఐఎఫ్ఏలో తొలుత దీన్ని లాంచ్ చసిన తర్వాత మార్కెట్లోకి దీన్ని ప్రవేశపెట్టింది. కాగా కర్వ్డ్ స్క్రీన్ డిస్ప్లేతో వచ్చిన ప్రపంచపు తొలి గేమింగ్ ల్యాప్టాప్ ఇదే కావడం విశేషం. ఈ ల్యాప్టాప్లో వీడియో గేమ్ ఆడుతుంటే థియేటర్లో ఉన్నట్లు అనుభూతి ఉంటుంది.
లెనెవో సంస్థ మార్కెట్లో తన తొలి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఫోన్ను కె320 టి పేరుతో విడుదల చేసింది. ఈనెల 4నుంచే ఈ ఫోన్ కోసం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ మొదలయ్యాయి. భారత కరెన్సీలో ఈ ఫోన్ విలువ రూ.9774/-. హారిజాంటల్ డ్యూయెల్ రియర్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఎక్స్-ఎ2 ఆల్ట్రా’ పేరుతో మొబైల్ దిగ్గజం సోనీ సంస్థ సరికొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఏడాది బార్సిలోనాలో జరిగే ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’ సందర్భంగా ఈ ఫోన్ను ఆవిష్కరిస్తారని సమాచారం. ఎక్స్పీరియా ఎక్స్ ఎ1 ఆల్ట్రాకు పొడిగింపుగా వస్తున్న ఈ విభిన్న స్మార్ట్ఫోన్ 6 అంగుళాల డిస్ప్లే కలిగి వుంటుంది.
ఇందులోని ఫీచర్లు..
చైనాకు చెందిన జియోనీ కంపెనీ ఈనెలలోనే భారతీయ మార్కెట్లో ఎస్11 స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఫోన్ ధర 20వేల రూపాయలు మించి ఉంటుందని అంచనా. ఫీచర్ల పరంగా చూస్తే- 5.99 అంగుళాల డిస్ప్లేతో సన్నని బెజెల్స్, ఫుల్ హెచ్డి 2160/1080 పిక్సెల్ రిజల్యూషన్, 18.9 యాస్పెక్ట్స్ రేషియో కలిగి వుంటుంది.