S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యువ
అత్యధిక మెమరీతో కూడిన ‘ఫైల్స్’ను మెయిల్ ద్వారా అటాచ్మెంట్గా పంపడం ఒక్కోసారి ఎవరికైనా విసుగు తెప్పిస్తుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ‘ఫైర్ఫాక్స్’ సంస్థ ‘సెండ్’ పేరిట ఉచిత సేవలను అందజేస్తోంది. దీన్ని వినియోగించుకుని ఒక జీబీ సామర్థ్యం వరకూ మనం ‘ఫైల్స్’ను మెయిల్ ద్వారా పంపుకోవచ్చు. దఆఆఔ://ఒళశజూ.చిజూళచ్యిన.ష్యౄ/ నుంచి ఈ సేవలను పొందవచ్చు.
మార్కెట్లోకి సరికొత్త ఫోన్లు, ట్యాబ్లు, ఐపాడ్లు వచ్చాయంటే చాలు వాటిని సొంతం చేసుకునేందుకు అందరిలోనూ ఆరాటమే.. విభిన్నమైన ఫీచర్ల కోసం అంతులేని అనే్వషణ.. అందుకే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. ప్రపంచంలోనే తొలి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించబోతున్న ‘యాపిల్’ విక్రయాల పరంగా ఆశించిన స్థాయిని అందుకోలేక పోతోంది.
చార్జింగ్ లేనపుడు ఎంతటి ఖరీదైన, ఎన్ని ఫీచర్లున్న స్మార్ట్ఫోన్ అయినా ఎందుకూ కొరగానట్టేనని ఎవరైనా నిరాశ పడడం సహజం. అందుకే- బ్యాటరీలు చార్జి అయ్యేందుకు ఎక్కువ సమయం నిరీక్షించే రోజులు తొందరలోనే కనుమరుగవుతాయని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. కెనడాకు చెందిన ‘వాటర్లూ’ పరిశోధకులు కొద్ది సెకన్లలోనే బ్యాటరీలను రీచార్జి చేసే ‘సూపర్ కెపాసిటర్’లకు రూపకల్పన చేశారు.
యువతను పెడదోవ పట్టిస్తున్న నేటి సభ్యసమాజం పోకడలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? భావితరాలకు ఉన్నత విలువలు నేర్పాల్సిన పెద్దవాళ్లే కుర్రకారు చేతికి బ్యాంకు కార్డులు, కారు తాళాలిచ్చి నీ ఇష్టానికి నువ్వు జల్సా చేసుకో! అంటూ విచ్చలవిడిగా గాలికి వదిలేస్తే... వారు ఎటు పోతున్నారో కనిపెట్టి నియంత్రించే పరిస్థితి కానరావడం లేదు. ఇందుకు కారణం తల్లిదండ్రుల పెంపకంలో లోపమా? లేక పాశ్చాత్య పోకడలా?
ఈ రోజుల్లో అన్ని వయసుల వారికీ మొబైల్ నిత్యావసర వస్తువుగా మారిన సంగతి తెలిసిందే. ఎవరూ మొబైల్ లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచం డిజిటల్ మీడియా వైపు శరవేగంగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో మొబైళ్ల వాడకం జీవితంలో ముఖ్య భాగంగా మారిపోయింది. ఫోన్ల వాడకం ఓ వ్యసనంలా మారడంతో వీటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
టూత్బ్రష్ వర్సెస్ మొబైల్
కర్నాటక సంగీతంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ‘భారతరత్న’ ఎంఎస్ సుబ్బులక్ష్మి ముని మనవరాలు ఐశ్వర్య సంప్రదాయ సంగీతంలో సత్తా చాటుకుని ఇపుడు నేపథ్య గాయకురాలిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఉమాశంకర్ దర్శకత్వంలో గురుకల్యాణ్ సంగీత దర్శకుడిగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘కురల్ 146’లో ఐశ్వర్య తన గాన మాధుర్యాన్ని వినిపించనున్నారు.
చైనాలో మొబైల్ ఫోన్ల తయారీలో అగ్రగామిగా ఉన్న షియోమి కంపెనీ రెడ్మి సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. లాంచ్ అయిన తరువాత డిసెంబర్ మొదటివారం నుంచి ఈ ఫోన్ అమ్మకాలకు వెళుతుందని కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని షియొమి కంపెనీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. షియోమి కంపెనీ నవంబర్ 30న విడుదల చేసిన ఫోన్ను ‘దేశ్కా స్మార్ట్ఫోన్’ అంటూ షియోమి సంస్థ అభివర్ణించింది.
కాలేజీలో సీటు.. స్కాలర్షిప్.. హాస్టల్లో అడ్మిషన్.. పోటీ పరీక్షలు.. బ్యాంకు లావాదేవీలు.. ప్రయాణాలు.. ఇలా ఏ సౌకర్యం పొందాలన్నా, ఎలాంటి బిల్లులు చెల్లించాలన్నా నేడు ‘ఆధార్ కార్డు’ను ఎవరైనా తమవెంట ఉంచుకోవడం అనివార్యం. ‘ఆధార్’ లేకుంటే ఏ పనులూ జరగని పరిస్థితి ఇపుడు నెలకొంది. హడావుడిలో దీన్ని మరచిపోతే ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు.
‘తగినంత తిండి లేక.. ఆకలితో అలమటిస్తూ నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. అయితే- ఈ కఠోర వాస్తవాన్ని చాలామంది అంగీకరించరు.. ఇలాంటి వారిలో అవగాహన కలిగిస్తే- వారు ఆహార పదార్థాలను వృథా
చేయకుండా జాగ్రత్త పడడమే కాదు.. అన్నార్తులకు ఎంతోకొంత సాయం చేస్తుంటారు..’
తన యూజర్ల కోసం ‘ఫేస్బుక్’ మరో శుభవార్తను మోసుకొచ్చింది. ఓ పవర్ఫుల్ ఫీచర్ను అతి త్వరలోనే వినియోగదారులకు అందించనుంది. ‘వాచ్’ పేరిట ఓ వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ను ఫేస్బుక్ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో వున్న ఫేస్బుక్ యూజర్లకు లభిస్తున్నది. త్వరలోనే భారత్లో దీన్ని లాంఛ్ చేయనున్నారు.