టాలీవుడ్లోకి...!
Published Saturday, 22 April 2017‘ఎం.ఎస్ ధోనీ’ చిత్రంలో కథానాయికగా మెరుపులు కురిపించిన భామ కైరా అడ్వానీ ఇక టాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. కొరటాల శివ- మహేష్బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకోనున్న తాజా చిత్రంలో నటించేందుకు కథానాయికల అనే్వషణ కొనసాగింది. ఎంతో మందిని అనుకున్నా చివరకు కైరానే ఓకే చేసుకున్నారట. మేలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి జూన్, జూలైలో నిరాటకంగా కొనసాగించనున్నారట. ఈ చిత్రం కోసం ‘్భరత్ అనే నేను..’ అనే టైటిల్ని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో మహేష్కు జోడీగా కైరా అడ్వానీని ఎంపిక చేయడం సంచలనమే. దీంతో టాలీవుడ్లో కూడా కైరా మెరుపులు చూడొచ్చు ఇక.