కళాకారుడి నివాళి
Published Thursday, 22 June 2017ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో ఇటీవల జరిగిన తీవ్రవాదుల దాడిలో 22మంది మరణించారు. వీరికి ఓ కళాకారుడు తనదైన రీతిలో నివాళి అర్పించాడు. ప్రఖ్యాత గ్రాఫిటీ కళాకారుడు ‘క్యూబెక్’ మాంచెస్టర్లోని ఓ కూడలిలో ఇంటి గోడపై 22 తేనెటీగల బొమ్మలు వేశాడు. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన మాంచెస్టర్లో ప్రతి ఒక్కరిని తేనెటీగతో పోలుస్తారు. అసలు హనీ బీ అన్న పేరు మాంచెస్టర్ వాసులు గర్వంగా చెప్పుకుంటారు. కష్టపడే తత్వానికి అది గుర్తు. అందుకే ఉగ్రవాదుల దాడిలో మరణించినవారిని తేనెటీగలతో పోలుస్తూ క్యూబెక్ నివాళి అర్పించాడన్నమాట. నిజానికి క్యూబెక్ అసలు పేరు రస్సెల్ మీహమ్. నలుగురు మిత్రులతో కలసి ఓ క్రేన్ సహాయంతో, పెయింట్ స్ప్రేతో ఈ గ్రాఫిటీ వర్క్ను క్యూబెక్ పూర్తి చేశాడు.