మొదట్లో ఇవి పశువులే తినేవి!
Published Saturday, 21 October 2017ప్రస్తుత ప్రపంచంలో అత్యంత బలవర్ధక ఆహారంగా వేరుశనగ తింటున్నారు. పెరూలో పుట్టి ప్రపంచానికి పరిచయమైన ఈ పంట మొదట్లో కేవలం పశువులకు ఆహారంగా మాత్రమే వాడేవారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వేరుశనగలో మూడింట రెండువంతులు చైనా, భారత్లోనే పండుతోంది. అయితే వినియోగంలో మాత్రం అమెరికన్లదే అగ్రస్థానం. అక్కడివారిలో 95 శాతం మంది వేరుశనగ వెన్న, ఆహార పదార్థాలను ఆరగిస్తారు. వేరుశనగ చీజ్, కేండీల వినియోగంలో వారే మొదటి స్థానంలో ఉన్నారు. అన్నట్లు వేరుశనగ గింజలపై ఉండే ఎర్రటి పొట్టును కాగితం పరిశ్రమలో వాడతారు తెలుసా!