తెలుగుజాతి గర్వించదగ్గ కవులు - రచయితలు
Published Saturday, 24 March 20181.‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎవరు అన్నారు?
ఎ.సురవరం ప్రతాపరెడ్డి
బి.దాశరథి కృష్ణమాచార్యులు
సి.సింగిరెడ్డి నారాయణరెడ్డి
డి.కాళోజి
2.‘రుద్రవీణ’ ‘గాలిబ్ గీతాలు’ లాంటి సుప్రసిద్ధ రచనలు ఎవరు రాశారు?
ఎ.తాపీ ధర్మారావు
బి.దాశరథి కృష్ణమాచార్యులు
సి.వాసిరెడ్డి సీతాదేవి
డి.రావూరి భరద్వాజ
3.‘కులం లేని మనిషి’ నవలని ఎవరు రాశారు?
ఎ.కొడవటిగంటి కుటుంబరావు
బి.రాయప్రోలు సుబ్బారావు
సి.సోమరాజు ఇందుమతిదేవి
డి.చేబ్రోలు సరస్వతీదేవి
4.‘గబ్బిలం’ అనే విశిష్టమైన కావ్యాన్ని రాసిన ప్రసిద్ధ రచయిత?
ఎ.విశ్వనాథ సత్యనారాయణ
బి.తాపీ ధర్మారావు
సి.గుర్రం జాషువా
డి.కొడవటిగంటి కుటుంబరావు
5.క్రింది వాటిలో ఏ పుస్తకం దేవులపల్లి వెంకట కృష్ణశాస్ర్తీ గారు రాయలేదు?
ఎ.అమృతవీణ బి.మేఘమాల
సి.మహతి డి.అడవి మల్లె
6.తన పుస్తకం ద్వారా ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?’ అని ఎవరు ప్రశ్నించారు?
ఎ.శ్రీరంగం శ్రీనివాసరావు
బి.తాపీ ధర్మారావు
సి.విశ్వనాథ సత్యనారాయణ
డి.ముళ్లపూడి వెంకటరమణ
7.మహిళాభ్యుదయం కోసం ‘వివేకవర్ధిని’ మరియు ‘సతిహిత బోధిని’ మాస పత్రికలను ఎవరు ప్రారంభించారు?
ఎ.తెనే్నటి హేమలత
బి.అబ్బూరి ఛాయాదేవి
సి.మాదిరెడ్డి సులోచన
డి.కందుకూరి వీరేశలింగం పంతులు
8.ప్రముఖ మహిళల జీవిత గాథలతో కూడిన ‘అబల సచ్ఛరిత్ర రత్నమాల’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఎ.బండారు అచ్చమాంబ
బి.కందుకూరి వీరేశలింగం పంతులు
సి. ముప్పాళ్ల
రంగనాయకమ్మ
డి.యద్దనపూడి
సులోచనారాణి
9.‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ అనే అత్యుత్తమ పుస్తకం వ్రాసి తెలుగు భాష రచనలలో ప్రథమంగా సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొన్న రచయిత ఎవరు?
ఎ.సురవరం ప్రతాపరెడ్డి
బి.చిలకమర్తి లక్ష్మీ
నరసింహం
సి.బులుసు వెంకటేశ్వర్లు
డి.విశ్వనాథ సత్యనారాయణ
10.‘విక్టోరియా ప్రశస్తి’ అనే పద్యకావ్యం ఆంగ్లంలో రాయడం ద్వారా క్వీన్ విక్టోరియా రాణిని ప్రశంసల వర్షం కురిపించిన రచయిత?
ఎ.గురజాడ అప్పారావు
బి.చార్లెస్ బ్రౌన్
సి.ఆర్థర్ కాటన్
డి.బోయి భీమన్న
*
గత వారం క్విజ్ సమాధానాలు
1.బి 2.బి 3.ఎ 4.సి 5.డి 6.బి 7.డి 8.ఎ