S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘కకోరీ’ త్యాగమూర్తులు

1.‘ఈ బ్రిటీష్ వారు మన దేశ అమూల్య సంపద దోచుకొని వాళ్ల దేశానికి తరలిస్తున్నారు. ఇది దోపిడీ కాక మరేమిటి. ముల్లుని ముల్లుతోనే తీయాలి కాబట్టి మనం కూడా బ్రిటీష్ ప్రభుత్వం ఖజానా కొల్లగొట్టి స్వాతంత్య్ర పోరాటానికి ఉపయోగిద్దాము’ అని ఏ సంస్థకు చెందిన ఉద్యమకారులు నిర్ణయించారు?

ఎ.లాల్ బాల్ పాల్ విప్లవ్ సంఘ్
బి.హిందుస్థాన్ పూర్ణ స్వరాజ్ మంచ్
సి.హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్
డి.ఆజాద్ హింద్ ఫౌజ్

2.కకోరి రైలు చోరీ ఘటన ఎప్పుడు జరిగింది?

ఎ.డిసెంబర్ 16, 1924 బి.డిసెంబర్ 17, 1926
సి.ఆగస్టు 2, 1924 డి.ఆగస్టు 9, 1925

3.బ్రిటీష్ వారి సొమ్ము కొల్లగొట్టి ఆ సొమ్ముతోనే ఆయుధాలు కొని వారిపైనే ఉద్యమిద్దాం మన భరతమాత సంకెళ్లు విప్పి, జైళ్లలో మగ్గుతున్న లక్షల మందిని విడిపించి మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ బూనిన ఏ యువ క్రాంతికారులు కకోరి రైలు ఘటనలో పాల్గొన్నారు?

ఎ.చంద్రశేఖర్ ఆజాద్, కేసబ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంద్ లాల్
బి.సచింద్ర బక్షి, మన్మథనాథ్ గుప్తా, జోగేష్ ఛటర్జీ, రాజేంద్ర లహిరి
సి.రామ్‌ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, అష్పాకుల్లా ఖాన్
డి.పైన పేర్కొన్న వారందరూ

4.ఒక్కొక్క స్టేషన్‌లో టిక్కెట్లు అమ్మిన సొమ్ము తోలు సంచీలను ఆయా స్టేషన్ మాస్టర్లు ట్రైన్‌లో గార్డుకి అప్పగించారు. కకోరీ స్టేషన్ సమీపంలో రైలు బండినాపి సొమ్ము చేజిక్కించుకొన్నారు. కకోరి ఎక్కడ ఉంది?

ఎ.బక్సర్ జిల్లా, బీహార్
బి.్ధన్బాద్ జిల్లా, ఝార్ఖండ్
సి.లక్నో జిల్లా, ఉత్తరప్రదేశ్
డి.గుణ జిల్లా, మధ్యప్రదేశ్

5.నువ్వు అప్రూవర్‌గా మారి మిగతా వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వు. నిన్నీ శిక్ష నుంచి తప్పిస్తాము అని బ్రిటీష్ వారడిగితే ‘వాళ్లు నా అన్నదమ్ములు లాంటి వారు. స్వాతంత్య్ర ఉద్యమానికి కులం, మతం, తెగ ఉండవు. మేమందరం భారతీయులమే. నన్ను ఉరికంబం ఎక్కించినా దేశం కోసం సంతోషంగా ప్రాణాలర్పిస్తాను కానీ మీ బ్రిటీష్ వారి మాటలకు లొంగను - అని అన్నదెవరు?

ఎ.చంద్రశేఖర్ ఆజాద్
బి.రామ్‌ప్రసాద్ బిస్మిల్
సి.అష్ఫాకుల్లా ఖాన్
డి.రాజేంద్ర లహిరి

6.దేశం కోసం ప్రాణాలర్పించిన రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్‌లను నిర్ణయించిన తేదీకి ముందుగానే వారికి ఉరిశిక్ష అమలుపరిచారు. ఏ తేదీ నాడు ఉరితీశారు?

ఎ.17 మే 1928
బి.28 జనవరి 1928
సి.19 డిసెంబర్ 1927
డి.17 డిసెంబర్ 1927

7.రాజేంద్ర లహిరిని ఏ తేదీ నాడు ఉరికంబమెక్కించారు?

ఎ.16 మార్చ్ 1929 బి.19 డిసెంబర్ 1928
సి.6 ఫిబ్రవరి 1928 డి.17 డిసెంబర్ 1927

8.వారి ఉరిశిక్ష ఆపడానికి ఎవరు ఏ రంగంలోకి దిగి బ్రిటీష్ చక్రవర్తికి ఎన్నో దరఖాస్తులు, విన్నపాలు, క్షమాభిక్ష అర్జీలు పెట్టి వారి ప్రాణాలు కాపాడడానికి విఫల ప్రయత్నాలు చేసేరు?

ఎ.వల్లభ్ పంత్
బి.మోతీలాల్ నెహ్రూ
సి.పండిట్ మదన్‌మోహన్ మాలవీయ
డి.పైన పేర్కొన్న వారందరూ

9.ప్రతి భారతీయులలో పౌరుషం పెంపొందించింది, రోమాలు నిక్కబొడుచుకొనేటట్లు చేసిన ఈ కకోరీ రైలు చోరీ ఘటనలో మిగతా వారందరికీ ఏ శిక్ష విధించారు?

ఎ.యావజ్జీవ కారాగారం
బి.పదేళ్లు కారాగార శిక్ష
సి.ఐదేళ్లు కారాగారం
డి.నాలుగేళ్ల నుంచి పదునాలుగు ఏళ్ల వరకు జైలుశిక్ష

10.కకోరీ రైలు చోరీ ఘటనలో పాల్గొన్న ఆ నలభై మంది స్వాతంత్య్ర సమరయోధులు ఎంతో పకడ్బందీగా ప్రణాళిక వేసుకొన్నా నెలలోపే అందరినీ బ్రిటీష్ సేనలు పట్టుకొని ఖైదు చేసేయి. ఎంతమందికి ఉరిశిక్ష విధించేరు?

ఎ.40 బి.14
సి.4 డి.2
==================================================================
గత వారం క్విజ్ సమాధానాలు
1.డి 2.డి 3.డి 4.సి 5.డి 6.సి 7.డి 8.సి 9.డి 10.డి

-సునీల్ ధవళ సెల్: 97417 47700