పర్యావరణ పరిరక్షణకు చెట్లే మూలాధారం
Published Friday, 22 July 2016కోడేరు, జూలై 21: పర్యావరణ పరిరక్షణకు చెట్లేమూలాధారమని స్థానిక ఎస్సై వెంకటరమణ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు గురువారం నిర్వహించిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని హరితహారం కార్యక్రమ ప్రాముఖ్యత గురించి వివరించారు. జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం దేశంలోనే ప్రాముఖ్యతను సంతరించుకుందని, మానవ మనుగడకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి బాధ్యతగా ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకొని పెంచి పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెబ్బెటి మల్లికార్జున్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.