విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Friday, 22 July 2016పామిడి, జూలై 21: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు ఉప్పర సూర్యనారాయణ (50) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం మండల పరిధిలోని దేవరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి గ్రామస్థులు అందించిన వివరాలిలా వున్నాయి.. వ్యవసాయ పొలంలో పంటను సాగు చేసిన రైతు ఉప్పర సూర్యనారాయణ నీరు పెట్టేందుకు వెళ్ళగా తెగిపడిన విద్యుత్ వైరు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. పోస్టుమార్టం నిమిత్తం సూర్యనారాయణ మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి జరిగిన సంఘటనపై విచారిస్తున్నట్లు ఎస్ఐ రవిశంకర్రెడ్డి తెలియజేశారు.