అరవింద్స్వామి నటన హైలెట్
Published Saturday, 23 July 2016రామ్చరణ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోందనీ, ఇటీవలే కాశ్మీర్లో మెలోడి సాంగ్ చిత్రీకరణ చేసామనీ రాంచరణ్ ఈ క్యారెక్టర్లో చాలా ఫ్యాషన్గా కనిపిస్తాడని తెలిపారు. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన ‘తని ఒరువన్’ చిత్రానికి రీమేక్గా ఈ సినిమాను తెరక్కిస్తున్నాం. రకుల్ప్రీత్సింగ్ అంద చందాలు చిత్రానికి హైలెట్గా నిలిస్తే, అరవింద్స్వామి పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి మరో హైలెట్గా నిలుస్తాయని ఆయన అన్నారు. సురేందర్రెడ్డి స్టైలిష్ మేకింగ్, అరవింద్స్వామి క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి ఎట్రాక్షన్గా నిలుస్తాయనీ, యాక్షన్ పార్ట్ని గ్రాండియర్గా షూట్ చేశామని, ఆగస్టులో సాంగ్స్ చిత్రీకరణచేసి, ఆగస్టు 15 ఫస్ట్లుక్, అక్టోబర్లో చిత్రాన్ని విడుదలచేస్తామని అన్నారు. అరవింద్స్వామి, నవదీప్, నాజర్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్- పి.యస్.వినోద్, మ్యూజిక్- హిప్హాప్ ఆది, నవీన్ నూలి, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు- సురేందర్రెడ్డి.