నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి
Published Saturday, 23 July 2016బాలీవుడ్లో ‘జిద్’ సినిమాతో వేడిపుట్టించిన మన్నారా, ఆ తరువాత తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పటికే రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్న ఈమె, తాజాగా సునీల్ సరసన ‘జక్కన్న’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతున్న సందర్భంగా మన్నారా ఇంటర్వ్యూ..
మీ పాత్ర ఎలా వుంటుంది?
ఇందులో నేను చాలా నేచురల్గా కనిపిస్తాను. అలాగే బబ్లీగర్ల్గా వుంటూ నా రియల్ లైఫ్ పాత్రకు దగ్గరగా ఉంటాను.
సునీల్తో నటించడం ఎలా వుంది?
తను చాలా ఫ్రెండ్లీగా వుంటాడు. డాన్సులు బాగా చేస్తాడు. ముఖ్యంగా ఆయన టైమింగ్ సూపర్. ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలను హిందీలో చూశాను. మంచి కామెడీ పండించగల నటుడు. తనతో కలిసి నటించడం కొంచెం కష్టమే కానీ, ఆయనిచ్చిన సపోర్టుతో బాగా చేశాననుకుంటున్నాను.
ఇందులో మీరు కూడా కామెడీ చేస్తారా?
అవును. సప్తగిరితో కలిసి నాకు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. మేము నటించిన సన్నివేశాలే ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి.
ఈ సినిమా హైలెట్స్ ఏంటి?
మంచి కథతోపాటు కుటుంబమంతా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. థియేటర్కు వచ్చిన ప్రేక్షకుడు రెండు గంటలపాటు ఎంజాయ్ చేసే సినిమా. దర్శకుడు వంశీకృష్ణ చక్కగా తెరకెక్కించాడు. ప్రతీ సన్నివేశంలో ఆయనదైన మార్క్ను చూపించాడు. ఇక ప్రొడక్షన్ విలువలు కూడా బాగున్నాయి. ప్రేమకథాచిత్రమ్ లాంటి సినిమా చేసిన బ్యానర్లో ఈ చిత్రం రావడం ఆనందంగా వుంది.
వరుసగా సినిమాలు చేస్తున్నారు?
అవును. ప్రస్తుతం జక్కన్నతోపాటు ‘రోగ్’, ‘తిక్క’ సినిమాల్లో నటిస్తున్నాను. తిక్క కూడా ఆగస్టు 13న విడుదలవుతోంది.
కెరీర్ ఎలా వుంది?
బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైనా తెలుగులో చాలా అవకాశాలు రావడం ఆనందంగా వుంది. ముఖ్యంగా ఇక్కడివారు ఎక్కువ ప్రొఫెషనల్గా వుంటారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు కూడా అలాగే ఆదరిస్తారు.
తదుపరి చిత్రాలు?
‘రోగ్’, ‘తిక్క’ త్వరలో విడుదలవుతున్నాయి. అలాగే మరి కొన్ని చర్చల దశలలో ఉన్నాయి.