కాబూల్లో కిడ్నాపయిన జుడిత్ క్షేమంగా విడుదల
Published Sunday, 24 July 2016న్యూఢిల్లీ, జూలై 23: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో గత నెల కిడ్నాప్కు గురయిన భారతీయ మహిళ జుడిత్ డిసౌజా క్షేమంగా విడుదలైంది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఈ విషయం తెలియజేశారు. ఆగాఖాన్ ఫౌండేషన్ తరఫున సీనియర్ టెక్నికల్ అడ్వైజర్గా పని చేస్తున్న జుడిత్ను గత నెల 9న కాబూల్లో ఆమె కార్యాలయం ముందు మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు కిడ్నాప్ చేశారు. జుడిత్ను క్షేమంగా విడిపించినందుకు అఫ్గాన్ ప్రభుత్వానికి సుష్మాస్వరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే జుడిత్ను విడిపించడానికి అఫ్గాన్లో భారత రాయబారి మన్ప్రీత్ వోరా చేసిన కృషిని సైతం ఆమె ప్రశంసించారు. జుడిత్ను క్షేమంగా విడిపించడానికి కృషి చేసినందుకు భారత ప్రభుత్వానికి కోల్కతాలోని ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.