మీవి పగటి కలలే!
Published Sunday, 24 July 2016న్యూఢిల్లీ, జూలై 23: కాశ్మీర్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెగేసి చెప్పారు. కాశ్మీర్పై పాక్ ప్రధాని నవాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సుష్మ ‘ఎన్ని యుగాలైనా కాశ్మీర్ భారత్దే.. ఈ విషయంలో పాకిస్తాన్వి పగటి కలలే’నని అన్నారు. ఏదో ఒక రోజు కాశ్మీర్ పాకిస్తాన్లో భాగం అవుతుందంటూ నవాజ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. కాశ్మీర్లో ఉద్దేశ పూర్వకంగానే హింసాకాండ రగిలిస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ అధికార యంత్రాంగమే ఇందుకు కారణం కావడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని అన్నారు.