పామూరులో స్వల్ప భూకంపం
Published Sunday, 24 July 2016పామూరు, జూలై 23: ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని బలిజపాలెం, కోడిగుంపల, బొట్లగూడూరు, కంభాలదినె్న గ్రామాల్లో శనివారం ఉదయం 6.20 గంటలకు, 7.10 గంటలకు రెండుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పామూరు మండలంలో దాదాపు ఇరవై ఐదుసార్లు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు.