స్కూల్ బస్సు ఢీకొని ముగ్గురి మృతి
Published Sunday, 24 July 2016విశాఖపట్నం(క్రైం), జూలై 23: స్కూలు బస్సు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మధురవాడ సమీపంలోని మారికవలసలో ఉంటున్న గుంటురెడ్డి కిషోర్కుమార్(30) నగరంలోని కేర్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తల్లి రేవతి(55), కుమార్తె వర్షిణి(6)తో కలిసి మోటార్ బైక్పై నగరం నుండి ఎండాడ మీదుగా మారికవలసలోని ఇంటికి బయలు దేరారు. ఎండాడ రోడ్డు గుండా వెళ్తుండగా అటు నుండి నగరంలోని వస్తున్న పోలక్ స్కూల్ బస్సు అదుపు తప్పి వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రేవతి అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, కిషోర్కుమార్, వర్షిణికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు రామ్నగర్లోని కేర్ ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో వీరిద్దరూ మృతి చెందారు. దీంతో ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ మార్చురీకి తరలించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని కుడుము ప్రాంతానికి చెందిన కిషోర్కుమార్ రెండేళ్ల నుండి భార్య, కుమార్తె, తల్లితో మారికవలసలో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. అత్త, కుమార్తెతో భర్త ఇంటికి భోజనానికి వస్తున్నారని, తెలిసి ఆశగా ఎదురు చూస్తున్న కిషోర్కుమార్ భార్య, సంఘటన తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.