శ్రీవారికి కారు బహూకరణ
Published Sunday, 24 July 2016తిరుమల, జూలై 23: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రముఖ ఆటోమొబైల్ రంగానికి చెందిన మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థ ప్రతినిధులు రూ.6.5 లక్షల విలువగల కెయువి 100 కొత్త మోడల్ కారును బహూకరించారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద శనివారం ఉదయం కారుకు పూజలు నిర్వహించి డిప్యూటీ ఇఓ కోదండరామారావుకు తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర మార్కెటింగ్ విభాగం సిఇఓ వివేక్, ఇతర ప్రతినిధులు భారత్ మసోడి, ఆర్ఎస్ఎం భూపేష్కుమార్, తిరుపతికి చెందిన బాలజీ ఏజన్సీస్ అధినేత రవీంద్రనాథ్, చిత్తూరు జిల్లా సిఇఓ జి.కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.