7న జైపూర్ విద్యుత్ కేంద్రం ప్రారంభం
Published Sunday, 24 July 2016ఆదిలాబాద్, జూలై 23: సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ సమీపంలో నిర్మిస్తున్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం పనులు పూర్తికావడంతో ఆగస్టు 7న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,200 మెగావాట్ల జైపూర్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రానున్నారు. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కెసిఆర్ ఆహ్వానించారు. దీంతో రామగుండం ఎన్టీపిసి కొత్తయూనిట్కు భూమి పూజ చేసేందుకు మోడి తెలంగాణకు వస్తుండటంతో వీలైతే జైపూర్ రావచ్చని ప్రచారం సాగుతోంది.