దుమ్మురేపిన జూనియర్ హాకీ జట్టు
Published Sunday, 24 July 2016మార్లో (ఇంగ్లాండ్), జూలై 23: ఇంగ్లాండ్ పర్యటనలో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు దుమ్మురేపింది. మార్లోలోని బిషామ్ అబ్బే స్పోర్ట్ సెంటర్లో జరిగిన తొలి మ్యాచ్లో స్కాట్లాండ్ సీనియర్ జట్టును 1-2 గోల్స్ తేడాతో మట్టికరిపించి శుభారంభాన్ని సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జట్టుకు నీలకంఠ పెనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్ను అందించాడు. ఆ తర్వాత బంతిపై పట్టు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికి భారత జట్టు 1-0 తేడాతో ఆధిక్యతలో నిలిచింది. వర్షం వలన దాదాపు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన ద్వితీయార్థంలో స్కాట్లాండ్కు పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ భారత గోల్కీపర్ కృష్ణ పాథక్ విజయవంతంగా ప్రతిఘటించాడు. అయితే చివరి నిమిషంలో సిమ్రాన్జీత్ సాధించిన గోల్తో భారత్ ఆధిక్యత రెట్టింపవగా, చివరి క్షణాల్లో స్కాట్లాండ్కు విలియమ్ మార్షల్ ‘కంటి తుడుపు’ గోల్ను సాధించిపెట్టాడు. దీంతో భారత జట్టు 2-1 గోల్స్ తేడాతో వియం సాధించింది.