ప్రో కబడ్డీ లీగ్లో అగ్రస్థానానికి పైరేట్స్
Published Sunday, 24 July 2016ముంబయి, జూలై 23: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్) నాలుగో ఎడిషన్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో పాట్నా పైరేట్స్ జట్టు మళ్లీ నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఆ జట్టు 31-28 పాయింట్ల తేడాతో పునేరీ పల్టన్ను మట్టికరిపించింది. అద్భుత ప్రదర్శనతో అలరించి రైడింగ్స్ ద్వారా 12 పాయింట్లు సాధించిన ప్రదీప్ నర్వాల్, డిఫెన్స్లో చక్కగా రాణించి టాకిల్స్ ద్వారా 5 పాయింట్లు రాబట్టిన భాజీరావ్ హొడాగే పైరేట్స్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకూ 12 మ్యాచ్లు ఆడిన పైరేట్స్కు ఇది తొమ్మిదో విజయం. దీంతో ఆ జట్టు మొత్తం 47 పాయింట్లతో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకగా, పునేరీ పల్టన్ 32 పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది.