మహంకాళి సన్నిధిలో కెసిఆర్ దంపతులు
Published Sunday, 24 July 2016సికింద్రాబాద్: సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం కెసిఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.