ఏడుగురు ఉపాధ్యాయులపై బాలికల ఫిర్యాదు
Published Sunday, 24 July 2016భువనేశ్వర్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే తప్పుడు మార్గంలో వెళితే మనం ముక్కున వేలేసుకోవాల్సిందే. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఏడుగురు టీచర్లపై 15 మంది బాలికలు ధైర్యంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోరాపుట్ జిల్లా దమన్జోడిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఉదంతం వెలుగు చూసింది. క్లాసురూమ్లో, లైబ్రరీలో, బడి ఆవరణలో అవకాశం దొరికినపుడల్లా ఏడుగురు మగ టీచర్లు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉన్నతాధికారుల ఆదేశంపై సంబంధిత టీచర్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.