కెటిఆర్ బర్త్డే సందర్భంగా పూలవాన !
Published Sunday, 24 July 2016హైదరాబాద్: తెలంగాణ ఐటి, మున్సిపల్ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్కు చెందిన తెరాస నాయకుడు ఎం.ప్రతాప్ ప్రైవేటు విమానం ద్వారా నగరంలో మూడు చోట్ల ఆదివారం ఉదయం పూలవాన కురిపించారు. ట్యాంక్బండ్, తెరాస భవనం, సచివాలయం ప్రాంతాల్లో విమానం ద్వారా పూలవాన కురిసింది. నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో పలురకాల విత్తనాలను కూడా విమానం ద్వారా జారవిడిచారు. హరితహారం కార్యక్రమం సందర్భంగా ఇలా విత్తనాల వానను కురిపించారు.