లోధా సిఫారసులకు ఎంసిఎ ఓకె
Published Sunday, 24 July 2016ముంబయి: జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులపై సుప్రీం కోర్టు తీర్పును ఏకగీవ్రంగా ఆమోదించినట్లు ముంబయి క్రికెట్ సంఘం ( ఎంసీఏ) అధ్యక్షుడు శరద్పవార్ ఆదివారం చెప్పారు. క్రికెట్ పరిపాలనా రాజ్యాంగాన్ని మార్పులు చేసి తిరిగి రాసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ఎంసీఏ అధ్యక్షుడు శరద్పవార్ నేతృత్వంలో ఆ సంఘం ఆదివారం సమావేశమైంది. ఒక్క రాష్ట్రానికి ఒక్క ఓటు అంశంపై మాత్రం కాస్త స్పష్టత కావాలన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా క్రికెట్కెంతో చేశానని, పరిపాలన నుంచి విశ్రాంతి తీసుకోవడం తనకు సంతోషమేనని పేర్కొన్నారు.