పుష్కరాల ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష
Published Sunday, 24 July 2016విజయవాడ: పుష్కర యాత్రికులకు సంపూర్ణ సహకారం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి సంగమ ప్రదేశంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అక్షయ పాత్ర, టీటీడీ సహకారంతో పుష్కర యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం సూచించారు.