బకెట్ బాంబుల పేరుతో బెదిరింపు
Published Sunday, 24 July 2016ఖమ్మం : బకెట్ బాంబుల పేరుతో పోలీసులను మావోయిస్టులు పరుగులు పెట్టించారు. గత రాత్రి రామచంద్రాపురం సమీపంలో వర్రెవాగు వద్ద బకెట్లు పెట్టి వాటిలో బాంబులు ఉన్నాయని చెప్పడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భద్రాచలం-వెంకటాపురం ప్రధాన రహదారిమీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.ఆగి ఉన్న బస్పుకు కూడా ఒక బకెట్ తగిలించి ఈ నెల 28న జరిగే మావోయిస్టుల వారోత్సవాలను విజయవంతం చేయాలని నినాదాలు ఇచ్చారు. అదే ప్రాంతంలో పోస్టర్లు వెదజల్లారు. బాంబు స్కాడ్తో వచ్చి పోలీసులు తనిఖీలు చేయగా బకెట్లలో ఎలాంటి బాంబులు లేవని తేలింది.