కూలీల ప్రాణాలతో చెలగాటం: మేయర్
Published Sunday, 24 July 2016హైదరాబాద్: నగరంలో పలుచోట్ల అనుమతుల్లేకుండా, నాసిరకం పనులతో భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, కొందరు కాంట్రాక్టర్లు కూలీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఫిలింనగర్లో ఆదివారం కుప్పకూలిన భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. భవనం కూలి ఇద్దరు కూలీలు మరణించగా, పది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఫిలింనగర్లోని కల్చరల్ క్లబ్లో నిర్మాణాలపై ఇప్పటికే హౌస్ కమిటీకి నివేదిక ఇచ్చామని, పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మేయర్ చెప్పారు.