ఫిలిం నగర్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన
Published Sunday, 24 July 2016హైదరాబాద్: ఫిలిం నగర్లోని కల్చరల్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలి ఇద్దరు కూలీలు మరణించడంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. కల్చరల్ సెంటర్లోకి ప్రవేశించి అక్కడ తలుపులు, అద్దాలు, ఫర్నిచర్ను వారు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి నాయకత్వంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి విష్ణువర్ధన్రెడ్డితో పాటు కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.