S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీటి కుంటలో పడి ఇద్దరి చిన్నారుల మృతి

భైంసా రూరల్, జూలై 24: ఈతకోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటి కుంటలోపడి మృతిచెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బారి ఇమామ్‌గల్లీ అసద్‌బాబానగర్ కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకోసం వెళ్లి నీటి కుంటలో పడి మృతిచెందారు. సయ్యద్ ఇమ్రాన్ (12), ముజంబిల్ ఖురీషి (9) అనే ఇద్దరు విద్యార్థులు పట్టణంలోని బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ సమీపంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుతుండగా, పాఠశాల ముగిసిన అనంతరం గోపాల్‌నగర్ వెనకభాగంలో ఉన్న నీటి కుంటలు ఈత కొట్టడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. స్కూల్‌కు వెళ్లిన పిల్లలు ఎంతకి ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లితండ్రులు వెతగ్గా.. గోపాల్‌నగర్ నీటి కుంట వద్ద సయ్యద్ ఇమ్రాన్ దుస్తువులు, చెప్పులు కన్పించడంతో కుంటలో వెతకగా విద్యార్థుల మృతదేహాలు లభ్యమాయ్యాయి. వాటిని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదుచేసి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.