గూడెం వంతెనపై రాకపోకలు నిలిపివేత
Published Monday, 25 July 2016దండేపల్లి, జూలై 24: మండలం గూడెం గోదావరి నదిపై గల పాత వంతెనపై నుంచి ఆదివారం ఆధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కడెం ప్రాజెక్ట్ నుండి గోదావరి నదిలోకి నీటిని వదలడంతో గోదావరి నదిలో నీటి ఉదృతి కోనసాగుతుంది. దీంతో పాత లోలేవల్ వంతెనకు ఇంచు కింద వరకు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గత కొద్ది రోజులుగా చిన్న వాహనాలకు అనుమతించిన అధికారులు ఆదివారం పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కోత్త వంతెన పనులు దాదాపుగా పూర్తికావడంతో అధికారులు కార్లు, అటోలు, ద్విచక్ర వాహనాలను నూతన వంతెనపై నుండి అనుమతించారు.