నారాయణరావు ఆశయ సాధనకు కృషి
Published Monday, 25 July 2016చింతపల్లి, జూలై 24: సిపిఐ సీనియర్ నాయకుడు, మునుగోడు నియోజకవర్గ స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని సిపి ఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. మండలంలోని టి.గౌరారం గ్రామంలో ఆదివారం జరిగిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఉజ్జిని నారాయణరావు స్మారక స్ధూపాన్ని ఆవిష్కరించిన అనంతరం స్మారక సభలో ఆయన మాట్లాడారు. నారాయణరావు పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి, పశ్య పద్మ, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మండల పార్టీ నాయకులు యుగేందర్రావు, నాగరాజు పాల్గొన్నారు.