అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కోదండరాం
Published Monday, 25 July 2016రాయికోడ్, జూలై 24: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని టిజెఎసి చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. మల్లన్నసాగర్ ముంపుగ్రామాల ప్రజలపై లాఠీ చార్జీ చేయడం దారుణమన్నారు.