S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రామాయణం... మీరే డిటెక్టివ్
మీరే డిటెక్టివ్:
మీకో ప్రశ్న: తిక్కన సోమయాజి రాముడి మీద
రాసిన పుస్తకం పేరేమిటి?
సుమంత్రుడు చెప్పిన మాటలని విని దశరథుడు చెప్పాడు.
‘ఇంకా మిగిలిన విషయాలని కూడా చెప్పు’
సుమంత్రుడు కన్నీళ్లు పెట్టుకుని రాముడి సందేశాల్లోని వివరాలని మళ్లీ చెప్పాడు.
రాముడు గంగని దాటి దక్షిణ తీరం చేరిన తర్వాత గుహుడు సుమంత్రుడితో చాలాసేపు మాట్లాడాడు. వారు అక్కడే ఉండి సీతారామ లక్ష్మణులు భరద్వాజుడి దగ్గరకి వెళ్లి ఆయనతో గడిపి చిత్రకూటానికి వెళ్లడం గురించి తెలుసుకున్నారు. గుహుడు చాలా దుఃఖంగా తన ఇంటికి తిరిగి వెళ్లాడు. తర్వాత రాముడి అనుమతి పొందిన సుమంత్రుడు ఉత్తమమైన గుర్రాలని రథానికి కట్టి, విచారంతో అయోధ్యకి తిరిగి బయలుదేరాడు.
శతృవినాశకులైన ఆ రాజకుమారులు ఆ రాత్రి భరద్వాజాశ్రమంలో గడిపి, మర్నాడు భరద్వాజ మహర్షికి నమస్కరించి చిత్రకూట పర్వతానికి ప్రయాణమయ్యారు. వారిని భరద్వాజుడు ఆశీర్వదించి తన పిల్లలు వెళ్లేప్పుడు సాగనంపినట్లుగా సాగనంపాడు. గొప్ప తేజశ్శాలైన ఆ ముని నిజ పరాక్రమం గల రామలక్ష్మణులతో ఇలా చెప్పాడు.
మంగళకరమైన ఆ రాత్రంతా సీతారామ లక్ష్మణులు ఆ పెద్ద మర్రిచెట్టు కింద నిద్రించి, మర్నాడు సూర్యోదయం తర్వాత అక్కడ నించి బయలుదేరారు. కీర్తిమంతులైన ఆ ముగ్గురూ ఆ పెద్ద అడవిలోకి ప్రవేశించి, అక్కడక్కడా గల అనేక రకాల భూభాగాలని, పూర్వం ఎన్నడూ చూడని అందమైన దేశాలని చూస్తూ యమునా నది, గంగానది కలిసే చోటకి చేరుకున్నారు. రాముడు అనేక రకాల చెట్లని చూస్తూ కష్టం కలగకుండా మెల్లగా సాయంత్రం దాకా నడిచాడు.
ఆనందింపజేసే వాళ్లలో శ్రేష్ఠుడైన రాముడు ఆ చెట్టు దగ్గరికి చేరి, పడమటి సంధ్యని ఉపాసించి లక్ష్మణుడితో చెప్పాడు.
శోకంతో కృశించిన గుహుడు తనని వెనక్కి వెళ్లమన్న రాముడితో స్నేహపూర్వకంగా చెప్పాడు.
మీకో ప్రశ్న
జగత్ ప్రథమ మంగళం రామం..
దీన్ని ఏ సంస్కృత కవి రాశారు?
తెల్లారాక రాముడు అక్కడ లేకపోవడం చూసి ఆ పౌరులు నిశే్చష్టులై బాధపడ్డారు. వాళ్ల కళ్లు తడిసాయి. విచారంగా అటు, ఇటు చూసినా వారికి రాముడి జాడ కూడా తెలీలేదు. రాముడు లేకపోవడంతో మంచి మనసుగల ఆ పౌరులు విచారంతో పాలిపోయిన మొహాలతో దీనంగా మాట్లాడుకున్నారు.