S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాంజలి

06/23/2018 - 21:14

సిరిపల్లి నాగేశ్వరరావు గారు ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన తాళమణి వీరు. 70కి పైగా విదేశాలు పర్యటించి కళాసేవ చేసిన మృదంగ విద్వాన్ వీరు. ఎన్నో ప్రఖ్యాత డాన్స్ ఫెస్టివల్స్‌లో వాయించారు. ఎన్నో ప్రదర్శనలకు మృదంగం, ఘటం వాయించారు. 35 సంవత్సరాలుగా మృదంగం, ఘటం సంగీత కచేరీలలో, నృత్య ప్రదర్శనల్లో ప్రతిభ చూపుతున్నారు.

06/16/2018 - 21:39

దేవులపల్లి ఉమ ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు, యాంకర్. ఎన్నో వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ కళామతల్లికి ఎనలేని సేవ చేస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య విభాగంలో ‘కూచిపూడి - రస సిద్ధాంత’ అనే అంశంతో పిహెచ్.డి కోసం పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ మానవ వనరుల శాఖ, న్యూఢిల్లీ ద్వారా ఎస్.ఆర్.ఎఫ్.

06/09/2018 - 21:32

డా. శ్రీమతి సరిత దిలీప్ కూచిపూడి, భరతనాట్యంలో ప్రసిద్ధ కళాకారిణి. ఆమె ప్రఖ్యాత గురువు, నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి, నృత్యప్రియ సంస్థ అధినేత్రి. సరిత నిర్మించిన టెలీఫిలింకి నాలుగు నంది అవార్డులు వచ్చాయి. ఆమె కళాసేవకు యునైటెడ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ - బర్క్‌లీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (లలితకళల రంగంలో) ఇచ్చారు. దశాబ్దాలుగా కళాసేవకు అంకితమైనారు.

06/02/2018 - 19:49

శ్రీ రామేశ్వరపు వినోద్ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. 1995 నుండి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో ఆయన పని చేస్తున్నారు. కొన్ని వేల ప్రదర్శనలకు మృదంగం, ఘటం, కంజీరా వాయించారు. అతి ప్రతిష్ఠాత్మక డాన్స్ ఫెస్టివల్స్‌లో నృత్య ప్రదర్శనలకు నట్టువాంగం చేశారు. చల్లగా, హాయిగా, తీయగా మాట్లాడుతూ ఉండే మంచి మనిషి! అభంగ తరంగ మృదంగం. వినోద్‌గారి మాట సున్నితం, మనసు నవనీతం.

05/26/2018 - 21:17

శ్రీమతి శే్వతప్రసాద్ గొప్ప గాయని, సంగీత విద్వాంసురాలు. సాక్షాత్తు ‘రక్తకన్నీరు’ నాగభూషణంగారి మనుమరాలు ఈవిడ. దేశ విదేశాలు పర్యటించి, ఎన్నో గానకచేరీలు ఇచ్చారు. వీరి భర్త రేణుకాప్రసాద్ కూడా గొప్ప సంగీత విద్వాంసులు. మృదంగం వాయిస్తారు. నట్టువాంగానికి ఎంతో పేరు తెచ్చుకున్నారు.

05/19/2018 - 21:23

శ్రీమతి గోవిందరాజు శ్రీదేవి ప్రఖ్యాత నాట్యకోవిదురాలు. ఒకవైపు గృహిణిగా, తల్లిగా వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంకోవైపు కళలకు ఎంతో సేవ చేస్తున్న బంగారు తల్లి, కల్పవల్లి. ఈవిడ నాట్య విద్వన్మణి, గురువు, పరిశోధకురాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బి.ఏ. (బంగారు పతకం), ఎం.ఏ., ఎం.్ఫల్ చేసి ప్రస్తుతం డా.అలేఖ్య పుంజాలగారి మార్గదర్శకత్వంలో పిహెచ్.డి. చేస్తున్నారు.

05/12/2018 - 19:25

ఎంతో ప్రతిభావంతుడైన రచయిత కాళ్లకూరి నారాయణరావు. సంఘ సంస్కరణ, సామాజిక స్పృహ, భావోద్వేగం, చక్కని కథనం గలవారు వీరు. ఎన్నో కథలు, నవలలు, ప్రహసనాలు, విమర్శలు రాశారు. కాళ్లకూరి నారాయణరావుగారు 28.4.1871లో బంగారు రాజు, అన్నపూర్ణమ్మల పెద్ద కుమారుడిగా పశ్చిమగోదావరి మత్స్యపురిలో జన్మించారు. తెలుగు, ఆంగ్లం బాగా చదువుకున్నారు. ఈయనపై కందుకూరి వీరేశలింగం పంతులుగారి సంఘ సంస్కరణ ప్రభావం బాగా పడింది.

05/04/2018 - 13:46

షకీల్ అహ్మద్ ప్రఖ్యాత రచయిత, కవి, పరిశోధకుడు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుభాషా ప్రవీణులు కూడా. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ భాషలలో అవలీలగా మాట్లాడగలరు, రాయగలరు. సంస్కృతం, అరబిక్ వచ్చు. ఎన్నో సన్మానాలు, అవార్డులు పొందినా, నిండు కుండ తొణకదు అంటారు. వీరి మాట సున్నితం, మనస్సు నవనీతం. తీయగా, హాయిగా, చమత్కారంగా నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడతారు వీరు.

04/28/2018 - 21:06

మల్లాది గోపాలకృష్ణ ఐదుసార్లు నంది అవార్డు గ్రహీత. వీరు ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, సాంకేతిక నిపుణుడు, మేకప్ ఆర్టిస్టు. 1992 నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, నాటక రంగంలో అధ్యాపకుడిగా పని చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు కళలలో ఎంతో సాధించిన నిండు కుండ. బంగారు కొండ. ఎన్నో అవార్డులు పొందారు. ఎన్నో సన్మానాలు పొందారు. అయినా వీరి మాట సున్నితం. మనసు నవనీతం.

04/21/2018 - 21:48

‘ఆంగికం భువనం యశ్య వాచికం సర్వ వాఙ్మయం/ ఆహార్యం చంద్ర తారాదితం వందే సాత్త్వికం శివం’
శివుడికి భువనములే అంగములు, అతనికి వాఙ్మయం ఈ శబ్దకోశము. చంద్రుడూ తారలే శివుడికి ఆహార్యం. అట్టి శివునికి నమస్కరిస్తున్నా..

Pages