S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వనపర్తి, జూలై 24: నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచిన నాడే లక్ష్యం నేరవేరి భావితరాలకు జీవం పోసిన వారమవుతామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలోని శాలి వాహన కమ్యూనిటీ హాల్ వద్ద, జీనియస్ పాఠశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.
ఆత్మకూర్, జూలై 24: మండలంలోని నందిమల్ల, జూరాల గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న పుష్కరాల పనులు నత్తనడకన సాగడం పట్ల రోడ్లు, భవనాలశాఖ చీఫ్ ఇంజనీర్ రవీంధర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు, జూలై 24: కృష్ణానది ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టుకు వచ్చిన వరదనీటితో 16వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆదివారం జూరాల ప్రాజెక్టులోని రెండు పవర్ హౌస్లతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 16వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు.
ఊట్కూర్, జూలై 24 : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు సాదనకు రామదండుల రైతులు, ప్రజలు రామదండులా కదిలిరావాలని తమ్మినేని వీరభద్రం, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగురావునామాజీలు పిలుపునిచ్చారు. అదివారం మండలంలోని బిజ్వార్, నిలుగుర్తి, అవుసలోనిపల్లి, పెద్దజట్రం గ్రామాలలో మహాపాదయాత్రలో పాల్గొన్నారు.
మహబూబ్నగర్, జూలై 24: జిల్లా నేతలు ఇక దూకుడు పెంచాలి. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. వారి తప్పులు పెరిగిపోయావని ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు చేయాలని టిడిపి జిల్లా ఇన్చార్జి, రాజసభ సభ్యుడు గరికెపాటి మోహన్రావు ఉద్భోదించారు. ఆదివారం షాద్నగర్ నియోజకవరం కొత్తూరు మండల పరిధిలోని పప్రాస్పోర్టులో జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశం రహస్యంగా నిర్వహించారు.
బాలానగర్, జూలై 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 316 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం బాలానగర్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలలో అభివృద్ద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మారెడ్డి శంఖుస్థాపన చేశారు.
కొత్తూరు, జూలై 24: తెలంగాణ రాష్ట్రాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధ్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లిలో నూతనంగా నిర్మించిన సింబాయసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సీటీ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.
అడ్డాకుల, జూలై 24: అధికార దాహం కోసం వలసదారులు ఉంటారని, నిజమైన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అన్నారు.
భూత్పూర్, జూలై 24: మానవాళికి జీవనాధారమైన మొక్కలను ప్రతి ఒక్కరు నాటాలని జిల్లా ఫారెస్టు అధికారి రాంమూర్తి అన్నారు. మండలంలోని అమిస్తాపూర్ సమీపంలోని రాజీవ్ గృహకల్పలో ఆదివారం మొక్కలను నాటారు.
నారాయణపేటటౌన్, జూలై 24: నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని డమాండ్ చేస్తూ జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర ఉధృతంగా సాగుతోంది.