S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 04:57

‘వందకాళ్ల జెర్రి’, ‘శతపాది’ అని మనం పిలిచే ‘సెంటిపెడె’కు నిజంగా అన్ని కాళ్లుండవు. మహా అయితే 15నుంటి 30 జతల కాళ్లుంటాయంతే. మొదటి జత కాళ్లు నడవడానికి ఉపయోగించవు. విషంతో కూడుకున్న ఆ రెండు కాళ్లతో ఆహారాన్ని పట్టుకోవడం లేదా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కుట్టడానికి ఉపయోగిస్తాయి. ఫలకాల గదులతో (షెల్) కూడిన శరీరంతో అతివేగంగా నడిచే జీవి ఇది. ప్రతి షెల్‌కు ఒక జత కాళ్లుంటాయి.

07/24/2016 - 04:56

విజయవాడ, జూలై 23: రాష్ట్రంలో సుమారు 2కోట్ల ఎకరాల భూమి సాగుకు అనువుగా వున్నందున ఈ ఏడాది వ్యవసాయ పంటల ఉత్పాదకతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పంటల బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఇతర అంశాలపై ఆయన శనివారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/24/2016 - 04:55

విజయవాడ, జూలై 23: పోలీస్‌శాఖలో రాష్ట్ర విభజనకు ముందు తాను వివిధ హోదాల్లో 30 ఏళ్లు పైగా పనిచేస్తే ట్రైనీ ఎఎస్‌పిగా గుంటూరులో కొంతకాలం పనిచేయటం మినహా పూర్తిస్థాయి తెలంగాణలో పనిచేసి అన్ని స్థాయిల్లోనూ అక్కడి వారందరితో మమేకమై విధులు నిర్వర్తించిన తనను రాష్ట్ర విభజన ఎంతో బాధించిందంటూ డిజిపి జెవి రాముడు ఉద్వేగంతో అన్నారు. విధి నిర్వహణలో దేశంలో అనేక రాష్ట్రాల్లో పర్యటించాను..

07/24/2016 - 04:52

విశాఖపట్నం, జూలై 23: ప్రభుత్వానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందంటే సదావర్తి భూములకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమేనని ఎపి సిఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖలో శనివారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఆక్రమణలపాలైన సదావర్తిసత్రం భూములను ఎలా ఉన్నవి అలాగే తీసుకునే ఒప్పందం ప్రకారం వేలం వేశామన్నారు.

07/24/2016 - 04:49

రాజమహేంద్రవరం, జూలై 23: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం లొసుగులమయంగా మారుతోంది. నిర్వాసితుల నుంచి తీసుకున్న భూమికి భూమి కేటాయిస్తామనే హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామంలో గిరిజనుల నుండి 57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకూ ఆ భూమికి భూమి కేటాయించలేదు.

07/24/2016 - 04:49

గుంటూరు, జూలై 23: కృష్ణాజలాల పంపిణీలో రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఏపి జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎగువన పుష్కలంగా వర్షాలుకురిసి వరద నీరు ఉన్నప్పటికీ దిగువకు నీటి విడుదల విషయంలో కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. శనివారం జలవనరులశాఖ చీఫ్ ఇంజనీరు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

07/24/2016 - 04:48

తిరుమల, జూలై 23: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రముఖ ఆటోమొబైల్ రంగానికి చెందిన మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థ ప్రతినిధులు రూ.6.5 లక్షల విలువగల కెయువి 100 కొత్త మోడల్ కారును బహూకరించారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద శనివారం ఉదయం కారుకు పూజలు నిర్వహించి డిప్యూటీ ఇఓ కోదండరామారావుకు తాళాలు అందజేశారు.

07/24/2016 - 04:43

విజయవాడ, జూలై 23: ప్రజా సాధికారిక సర్వేలో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకులకు ఎప్పటికప్పుడు తెలిపేందుకై విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్టస్థ్రాయిలో కమాండ్ కంట్రోల్ రూంను ప్రారంభించారు. ఇక్కడ సిబ్బంది రెండు షిఫ్టులలో పనిచేయటంతోపాటు 24 గంటలు కంట్రోల్ రూం ద్వారా సేవలు అందిస్తారని, ఎన్యూమరేటర్లకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా సమకూర్చామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు.

07/24/2016 - 04:42

విశాఖపట్నం(క్రైం), జూలై 23: స్కూలు బస్సు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మధురవాడ సమీపంలోని మారికవలసలో ఉంటున్న గుంటురెడ్డి కిషోర్‌కుమార్(30) నగరంలోని కేర్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తల్లి రేవతి(55), కుమార్తె వర్షిణి(6)తో కలిసి మోటార్ బైక్‌పై నగరం నుండి ఎండాడ మీదుగా మారికవలసలోని ఇంటికి బయలు దేరారు.

07/24/2016 - 04:41

ఒంగోలు అర్బన్, జూలై 23: రాష్ట్ర మాజీ మంత్రి గుర్రాల వెంకట శేషు (71) శనివారం తెల్లవారుజామున ఒంగోలులో గుండెపోటుతో కన్నుమూశారు. శేషు 1989 నుండి 94 వరకు సంతనూతలపాడు శాసనసభ్యునిగాను, 1989 నుండి 90 వరకు మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పాడి పరిశ్రమ, క్రీడలు, లిడ్‌క్యాప్ శాఖ మంత్రిగా పని చేశారు. 2007-09 వరకు శాసనమండలి సభ్యునిగా పని చేశారు. 2009లో కొండెపి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

Pages