జాతీయ వార్తలు
జమ్మూకాశ్మీర్లో మొబైల్ సేవలు పునరుద్ధరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 January 2020
జమ్మూకాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిర్బంధంలో ఉన్న కాశ్మీర్ నేతలను ఒక్కొక్కరిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 36 మంది కేంద్ర మంత్రుల బృందం శనివారం నుండి పర్యటిస్తుంది. అలాగే జమూకాశ్మీర్వాసులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అక్కడ ప్రీపెయడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ ఆదేశాలు సైతం జారీ చేయటం జరిగింది. ప్రీ పెయిడ్ మొబైల్ యూజర్లకు ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ సేవలను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర సేవలను అందజేసే సంస్థల్లో బ్రాడ్బాండ్ సేవలను కూడా పునరుద్ధరించారు.