S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/14/2020 - 04:24

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని వైన్‌షాప్‌ల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి అంశాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటి వరకు అక్రమంగా మద్యం అమ్మిన వారిపై 675 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అదేశాలు జారీ చేశారు. సోమవారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉన్నాతాధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు.

04/14/2020 - 03:23

గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పలు కేసుల్లో దాఖలైన పిటీషన్లపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన రాష్ట్రప్రభుత్వం కొత్త కమిషనర్‌గా మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను నియమించడం, ఆయన బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.

04/14/2020 - 00:50

శామీర్‌పేట, మార్చి 13: జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డు ప్రాంతంలో ఇద్దరు యువతులు అనుమానస్పదంగా మృతిచెందారు. కుషాయిగుడ ఏసీపీ శివ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు తమ భర్తలతో గొడవ పడి శామీర్‌పేట మీదుగా స్థానికంగా తెలిసిన పాస్టర్ సహాయంతో ఇక్కడికి వచ్చారు. పాస్టర్ ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు.

03/23/2020 - 05:59

సబ్బవరం, మార్చి 22: విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలం అమృతపురం గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి తన ఆటోలో తీసుకెళ్ళి సూరిరెడ్డిపాలెం శివార్లలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్థానిక సీఐ ఆర్‌వీవీఎస్‌ఎస్ చంద్రశేఖరరావు తెలిపిన వివరాలివి. బాలిక(15) సబ్బవరంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది.

03/22/2020 - 04:39

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని నివారించే ప్రక్రీయలో ముందు జాగ్రత్త చర్యగా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు రోజువారి ఫిర్యాదు కేసుల విచారణ వాయిదా వేసింది.

03/22/2020 - 04:31

చందర్లపాడు: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో శనివారం ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కన్నతల్లే కర్కశంగా నీటితొట్టిలో వేసి వీరి ఉసురుతీసిందనే అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. ఆమె ఇంట్లో కనిపించకుండా పోవటంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. పోలీసుల కథనం ప్రకారం..

03/22/2020 - 04:23

జలుమూరు, మార్చి 21: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో రాణా పంచాయతీ(కొత్తపేట)కు చెందిన కౌలురైతు సిహెచ్ శంకరరావు(36) శుక్రవారం రాత్రి కుటుంబంతోసహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంకరరావుతోపాటు ఆయన భార్య కళావతి(30) పెద్ద కుమార్తె గీతాంజలి(10) పురుగు మందును సేవించారు.

03/22/2020 - 02:18

సికిందరాబాద్, మార్చి 21: రైల్వే స్టేషన్‌లలో, నడుస్తున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన భార్యభర్తలను సికింరాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.16లక్షల 80వేల విలువైన బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

03/22/2020 - 02:17

శామీర్‌పేట, మార్చి 21: క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు మృతిచెందారు. జవహర్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం సీఆర్‌పీఎఫ్ ప్రాంతంలోఅరుణ్‌జ్యోతీ కాలనీలో మట్టి కోసం అక్రమంగా గుంతలను తీశారు. గుంతల్లో వర్షం నీరు చేరుకోవడంతో అదే ప్రాంతానికి చెందిన రాహుల్(9), హేమంత్ (12) అనే ఇద్దరు విద్యార్థులు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు ఇరుక్కపోయారు. దీంతో ఊపిరి ఆడక ఆ క్వారీలో ప్రాణాల కోల్పోయారు.

03/22/2020 - 02:16

షాద్‌నగర్ టౌన్, మార్చి 21: ఏటీఎం అద్దాలను ధ్వంసం చేసిన సంఘటన పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కన చోటు చేసుకుంది.

Pages