తెలంగాణ

కరోనాపై కాంగ్రెస్ అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యంపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. అన్నపూర్ణ కేంద్రాలపై సమాచారం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. వలస కూలీల పరిస్థితుల పై అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు లేని వారికి బియ్యం, డబ్బులు ఇవ్వాలన్నారు. టీపీసీసీ కరోనా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పనులు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ నెల 15 లేదా 16వ తేదీన అఖిల పక్షం నిర్వహిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కర పరిస్థితి నెలకొందని, ఇప్పటికే ఒక లక్షకు పైగా కరోనాతో చనిపోయారన్నారు. లక్ష మంది కరోనాకు గురయ్యారని, అమెరికా లాంటి అగ్ర దేశంలో ఒక్క రోజే 1500కుపైగా చనిపోయారన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే, మ దేశంలో ఆ స్థాయిలో లవేకపోవడం అదృష్టమన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనాపై ముందుగా కేంద్రాన్ని హెచ్చరించిన విషయాన్ని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాహుల్‌గాంధీ ఇచ్చిన సలహాలను పెడచెవిన పెట్టారన్నారు. పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లు పెట్టిన తర్వాత కేంద్రం లాక్ డౌన్‌కు వెళ్లిందన్నారు. తెలంగాణలో మార్చి 21వ తేదీన ప్రకటన చేశారని, 22 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిందన్నారు. నాటి నుంచి ఇంతవరకు 21 రోజుల తర్వాత నిరుపేదలు, కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఎలా బ్రతుకుతారన్నారు. చాలా మందికి రాష్ట్రప్రభుత్వం నుంచి సహాయం అందలేదన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు రూ.1500 ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా పైసా అందలేదన్నారు. మనిషికి 12వేల కిలోల బియ్యం 60 శాతం మంది ప్రజలకు చేరిందన్నారు. ప్రజలకు అందిన సాయంపై సీఎం కేసీఆర్ సమగ్రంగా లేఖ రాశామని, సీఎస్‌ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని, వెంటనే వేతనాలు అందచేసి మాస్కులు , గ్లౌజులు, శానిటైజర్లు అందచేయాలన్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలొడ్డి పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ గ్రామ పంచాయతీ, పోలీసు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితర కార్మికులకు ప్రభుత్వం అదనంగా సగం జీతం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఉన్న వలస కూలీలను ఆదుకనే విషయంలో ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు చెప్పారన్నార. కడపులో పెట్టుకుని చూస్తామన్నారని, కాని సాయం అందిచలేదన్నారు. ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు వలస కూలీల పరిస్థితి, పేదలకు డబ్బులు బియ్యం అందిన అంశాలను సేకరించి నివేదిక అందిస్తామన్నారు. హైదరాబాద్‌లో వలస కూలీలకు రెండు పూటలా భోజనాల కోసం 200 అన్నపూర్ణ కేంద్రాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుందని అయితే వాటి వివరాలు కావాలని అడిగితే ఇంతవరకు ఇవ్వలేన్నారు. ఉపాధి హామీ కూలీలకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, రెండు నెలల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలో ఉన్నారని వారు భేషరతుగా సమ్మె విరమించినా పనిలోకి తీసుకోవడంలేదన్నారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితులు తీవ్రంగా ఉంటే కేసీఆర్ కాలేశ్వరం మూడో టీఎంసీ పనుల కోసం 22వేల కోట్ల రూపాయల టెండర్లు వేయడం దారుణమన్నారు. వీటిని వెంటనే రద్దు చేయాలన్నారు. దేశంలో ధనిక రాష్టమ్రని దేశానికి అన్నం పెడుత్నునమని గొప్పలు చెప్పిన కేసీఆర్ పది రోజులకే చేతులవు ఎత్తేశారన్నారు. నెలవకు 24 వేల కోట్ల రూపాయల ఆదాయం ఉందని చెప్పిన కేసీఆర్ మ ఆర్చి నెలలో పది రోజుల లాక్‌డౌన్ కే ఉద్యోగుల వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవని కోతలు పెట్టారన్నారు. వృద్థుల పెన్షన్ డబ్బుల్లో కూడా కోతలు పెట్టిన దుర్మార్గం కేసీఆర్‌దేనన్నారు.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి