తెలంగాణ
సోనీభాయ్ ఇంటికి అమిత్షా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 6 July 2019
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణలో అమిత్షా పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్షాకు గవర్నర్ నరసింహాన్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయన పహాడీ షరీఫ్లోని రంగనాయకుల తండాలో నివశిస్తున్న బీజేపీ క్రియాశీల కార్యకర్త సోనీభాయ్ ఇంటికి చేరుకున్నారు. ఆమెకు పార్టీ సభ్యత నమోదు పత్రాన్ని అందజేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆమె వడ్డించిన జొన్నరొట్టె, పప్పు, ఉప్మాను ఆరగించారు. కాగా ఈ సందర్భంగా సోనీభాయ్ స్థానిక సమస్యలపై అమిత్షాకు వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో అమిత్షాతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.