అనంతపురం
ప్యాకేజీలతో సరిపెడుతున్న ప్రభుత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 August 2016
ధర్మవరం, ఆగస్టు 21: రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అయినా హోదా పట్ల విభజన చట్టంలోని అంశాలను ఏపి ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయనతోపాటు డిసిసి అధ్యక్షులు కోటా సత్యంలు మాట్లాడుతూ తమ పార్టీ సైతం ఏపికి ప్రత్యేక హోదా కావాలని కోరుతోందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీలతోనే సరిపెట్టుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఎన్నో ఉపయోగాలు వున్నాయని, తద్వారా రాష్ట్భ్రావృద్ధి చెందగలదన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ రంగన అశ్వర్థనారాయణ, నాయకులు అమీర్బాషా, పెనుకొండ పార్టీ కన్వీనర్ చంద్రకాంతమ్మ, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.