అనంతపురం

నేడు గుమ్మఘట్ట మండలంలో సిఎం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మఘట్ట, ఆగస్టు 30 : మండలంలోని 75 వీరాపురంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా జిల్లా వ్యాప్తంగా ఎండుతున్న వేరుశెనగను పరిశీలించేందుకు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉంది. ఈమేరకు మంగళవారం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కామినేని శ్రీనివాస్, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా 75 వీరాపురం గ్రామ సమీపంలో సభాస్థలి, పూలకుంట గ్రామం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వేరుశెనగకు రక్షక తడులు ఇప్పించి ఒక్క ఎకరా కూడా ఎండకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు. ఇప్పటికే కావాల్సిన రెయిన్‌గన్‌లు, జనరేటర్లు, పైపులు అందించామన్నారు. అనంతరం వీరాపురం, గుమ్మఘట్ట గ్రామాల్లోని పొలాల్లో రక్షత తడులు అందిస్తున్న రెయిన్‌గన్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామారావు, డిఎంహెచ్ వెంకటరమణ, ఎంపిడిఓ మునెయ్య, తహశీల్దార్ అఫ్జల్‌ఖాన్, ఏడి మద్దిలేటి ఏఓ శ్రీనివాసులు, నాయకులు జడ్పీటీసీ పూలనాగరాజు, ఎంపిపి గిరిమల్లప్ప, మాజీ ఎంపిపి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.