అనంతపురం
మహిళా రైతు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 2 September 2016
శింగనమల, సెప్టెంబర్ 1 : మండల పరిధిలోని చిన్న మట్లగొంది గ్రామానికి చెందిన బండి సుంకమ్మ(40) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిన్నమట్లగొందికి చెందిన సుంకమ్మ తనకున్న ఐదెకరాల పొలంలో వేరుశెనగ సాగుచేశారు. అయితే పంటలు ఎండిపోవడంతో సాగు చేసిన రూ.6లక్షల అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హమీద్ఖాన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.