అనంతపురం

నృసింహుని సేవలో హైకోర్టు జడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరిటౌన్, ఏప్రిల్ 3 : పట్టణంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామిని హైకోర్టు జడ్జి సీతారామమూర్తి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు, జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ, స్థానిక జడ్జిలు డా.్ఫజలుల్లా, వాణి, ఆదినారాయణలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జడ్జి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి, ఆలయ విశిష్టత గురించి అర్చకులచే అడిగి తెలుసుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ రవికుమార్, పట్టణ ఎస్సై సాగర్ బందోబస్తు నిర్వహించారు.
శ్రీ నెట్టికంటిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
గుంతకల్లు: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీతారామమూర్తి దర్శించుకున్నారు. న్యాయమూర్తి సీతారామ మూర్తితో పాటు ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ లాంచనాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి స్వామి పట్టువస్త్రాలు, స్వామి వారి ఆశీస్సులను ఆలయ అర్చకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సుబ్రమణ్యం, గుంతకల్లు జెఎఫ్‌సిఎం వాసుదేవరావు, రైల్వే కోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డిలు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ ముత్యాలరావు, ఎఇఓ ధనుంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.